Visakhapatnam: విశాఖలో కలకలం రేపిన దంపతుల దారుణ హత్య…
- దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన
- 24 గంటల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన
- మృతులు యోగేంద్ర బాబు (66), భార్య లక్ష్మి (52)
- ఇంటికి తాళాలు వేసి పారిపోయిన దుండగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో దంపతుల దారుణ హత్య కలకలం రేపింది. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 24 గంటల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతులు రిటైర్డ్ నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగి గంపల యోగేంద్ర బాబు (66), భార్య లక్ష్మి (52)గా పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఇంటికి తాళాలు వేసి పారిపోయారు. యోగేంద్ర బాబు మేనల్లుడు.. ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో దంపతులు పడి ఉన్నారు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్నారు.
READ MORE: YS Jagan Helicopter Incident: జగన్ పర్యటనలో హెలికాప్టర్ ఘటనపై విచారణ వేగవంతం..
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
తాళాలు పగలగొట్టి లోపల చూడగా హాల్లో భర్త, రూములో భార్య రక్తపు మడుగులో పడి ఉన్నారు.. ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారు? అనేదానిపై దర్యాప్తు చేపడుతున్నారు. పోలీసులు ఆధారాలకోసం ప్రయత్నిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. ఇంటి చుట్టూ పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గురువారం సాయంత్రం 7.30 గంటల సమయంలో గట్టిగా అరుపులు వినిపించాయని.. అయితే అవి భార్యాభర్తల గొడవలుగా భావించి వెళ్లలేదని స్థానికులు తెలిపారు. గురువారం అందరూ గ్రామదేవత పండగ హడావుడిలో ఉండగా ఆ సమయంలో ఇంట్లోకి ప్రవేశించి దుండగులు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా.. వారు అమెరికాలో ఉన్నారు.
READ MORE: Virginia Giuffre: ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన గియుఫ్రే ఆత్మహత్య
తాజావార్తలు
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..