BRS Satire on Kavitha New TRS Party: కవిత పార్టీపై బీఆర్ఎస్ వ్యంగ్యంగా స్పందించింది. కవిత తన కొత్త పార్టీ పేరును టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన)గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన బీఆర్ఎస్.. ఎంతైనా ఒరిజినల్ ఒరిజినలే అని సెటైర్ వేసింది. కవిత పార్టీ పేరును కాపీ కొట్టిందని అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది. సెటైర్గా ఒరిజినల్, డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలు షేర్ చేసింది బీఆర్ఎస్. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ బీఆర్ఎస్ పోస్ట్ చేసింది.
ఇక, కేసీఆర్ మారిన మనిషి.. మన మనిషి కాదు.. మర మనిషి అని కవిత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏ కష్టమొచ్చినా ఆ సారు రారు, ఎందుకంటే ఆయన మారిన మనిషి.. ఆయన గుంటనక్కల చేతిలో ఇరుక్కున్న మనిషి, మన మనిషి కాదన్నారు. “మన కేసీఆర్ అయ్యింటే పాలమూరు ప్రాజెక్టును కట్టించేవారు.. మారిన కేసీఆర్ పంజాబ్ వెళ్లారు.. జాతీయ పార్టీ పెడతానని చెప్పారు.. సింగరేణిలో గనిలో కార్మికుడు చనిపోతే చూసొచ్చే వ్యక్తి.. కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారు.. కేటీఆర్ మాట్లాడారంటే అనుకోవచ్చు.. ఆయనకు రాజకీయం తెలియదు.. ఒక కర్కోటకుడి పాలన నడుస్తోంది.. ఇళ్లను కూల్చుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి కేసీఆర్ ఎక్కడున్నారు..? మారుతారేమోనని చూశా.. కానీ, నన్నే సస్పెండ్ చేశారు. ఉద్యమకారులను పార్టీ నుంచి బయటకు పంపిన రోజే నేను మాట్లాడాల్సింది.. కానీ, మాట్లాడలేదు.. ఇవాళ నాకు అదే జరిగింది.. ఉద్యమంలో కొట్టినవారినే తీసుకొచ్చి పట్టం కట్టారు.. వాళ్ల అనుచరులు మనవాళ్లను అణగతొక్కారు.. ఉద్యమకారులను నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా సరిపోయేది.. కండువా వేసుకొని అప్పుడు పిచ్చొల్లలాగా తిరిగాం.. ఆ పార్టీలో అమ్మతనం పోయింది, మమకారం పోయింది.. అందుకే కేసీఆర్ మన కేసీఆర్ కాదు.. మరబొమ్మ అయ్యారు.” అని కవిత వ్యాఖ్యానించారు.
ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే! pic.twitter.com/YBlx20tlRf
— BRS Party (@BRSparty) April 25, 2026
