Nalgonda: బీఆర్ఎస్ రైతు మహా ధర్నా.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేటీఆర్
- బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నల్లగొండ పట్టణంలో రైతు మహా ధర్నా..
- ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేటీఆర్
- మూడు గంటల సమయాన్ని మాత్రమే అనుమతించిన పాలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalgonda: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో రైతు మహా ధర్నా జరగనుంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. అలాగే మాజీ మంత్రి గుంటకంట్ల జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర బీఆర్ఎస్ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఈనెల 12న నిర్వహించాల్సిన ఈ మహాధర్నాను సంక్రాంతి పండుగ కారణంగా వాయిదా వేసి 21న నిర్వహించేందుకు నిర్ణయించారు. కానీ, ఆ రోజుకు అనుమతి నిరాకరించిన పోలీసులు, నేడు ధర్నా నిర్వహించేందుకు చివరకు అనుమతించారు.
Also Read: Gas Cylinder Blast: ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరు మృతి, 8 మందికి సీరియస్..!
Also Read
- Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
- Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
21న ట్రాఫిక్ సమస్యలు, గ్రామ సభల నిర్వహణ కారణంగా అనుమతి లేదని చెప్పిన పోలీసులు, బీఆర్ఎస్ నేతల హైకోర్టు ఆశ్రయంతో 27న ధర్నాకు అనుమతి ఇచ్చారు. అయితే, పార్టీ నాయకులు ధర్నా నిర్వహించేందుకు పోలీసుల అనుమతి కోరగా, 1500 మంది భాగస్వామ్యంతో ర్యాలీకి అనుమతి ఇచ్చారు. ర్యాలీ పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి క్లాక్ టవర్ వరకు సాగి, గడియారం సెంటర్లో మహాధర్నా నిర్వహించనున్నారు. పోలీసులు ఈ ధర్నా కోసం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మూడు గంటల సమయాన్ని మాత్రమే అనుమతించారు. దీనికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
Also Read: Ind vs Eng 3rd T20: నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20.. సిరీస్పై కన్నేసిన టీమిండియా
రైతు సమస్యలను ప్రస్తావిస్తూ, రైతుల పక్షాన బీఆర్ఎస్ తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ ఈ సందర్భంగా వివరించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలపై ప్రభుత్వానికి తీర్మానాలను అందించడమే ఈ మహాధర్నా ముఖ్య ఉద్దేశ్యం. దీనితో ప్రజల దృష్టి నల్లగొండ పట్టణంలో మహాధర్నా ప్రజల దృష్టిని ఆకర్షించనుంది. మహా ధర్నా నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ధర్నా ద్వారా బీఆర్ఎస్ రైతు సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఎలా ఆకర్షిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!