Nalgonda: బీఆర్ఎస్ రైతు మహా ధర్నా.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేటీఆర్
- బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నల్లగొండ పట్టణంలో రైతు మహా ధర్నా..
- ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేటీఆర్
- మూడు గంటల సమయాన్ని మాత్రమే అనుమతించిన పాలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalgonda: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో రైతు మహా ధర్నా జరగనుంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. అలాగే మాజీ మంత్రి గుంటకంట్ల జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర బీఆర్ఎస్ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఈనెల 12న నిర్వహించాల్సిన ఈ మహాధర్నాను సంక్రాంతి పండుగ కారణంగా వాయిదా వేసి 21న నిర్వహించేందుకు నిర్ణయించారు. కానీ, ఆ రోజుకు అనుమతి నిరాకరించిన పోలీసులు, నేడు ధర్నా నిర్వహించేందుకు చివరకు అనుమతించారు.
Also Read: Gas Cylinder Blast: ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరు మృతి, 8 మందికి సీరియస్..!
Also Read
21న ట్రాఫిక్ సమస్యలు, గ్రామ సభల నిర్వహణ కారణంగా అనుమతి లేదని చెప్పిన పోలీసులు, బీఆర్ఎస్ నేతల హైకోర్టు ఆశ్రయంతో 27న ధర్నాకు అనుమతి ఇచ్చారు. అయితే, పార్టీ నాయకులు ధర్నా నిర్వహించేందుకు పోలీసుల అనుమతి కోరగా, 1500 మంది భాగస్వామ్యంతో ర్యాలీకి అనుమతి ఇచ్చారు. ర్యాలీ పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి క్లాక్ టవర్ వరకు సాగి, గడియారం సెంటర్లో మహాధర్నా నిర్వహించనున్నారు. పోలీసులు ఈ ధర్నా కోసం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మూడు గంటల సమయాన్ని మాత్రమే అనుమతించారు. దీనికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
Also Read: Ind vs Eng 3rd T20: నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20.. సిరీస్పై కన్నేసిన టీమిండియా
రైతు సమస్యలను ప్రస్తావిస్తూ, రైతుల పక్షాన బీఆర్ఎస్ తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ ఈ సందర్భంగా వివరించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలపై ప్రభుత్వానికి తీర్మానాలను అందించడమే ఈ మహాధర్నా ముఖ్య ఉద్దేశ్యం. దీనితో ప్రజల దృష్టి నల్లగొండ పట్టణంలో మహాధర్నా ప్రజల దృష్టిని ఆకర్షించనుంది. మహా ధర్నా నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ధర్నా ద్వారా బీఆర్ఎస్ రైతు సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఎలా ఆకర్షిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
-
Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
-
Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
-
Telangana Teachers: తెలంగాణ టీచర్లకు శుభవార్త..
-
Jr NTR: రాజకీయాల్లోకి ఎన్టీఆర్..అసలు విషయం ఇదే!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!