NTV Telugu Site icon

Harish Rao: 12 రోజులు గడస్తున్నా.. ఇంకా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు!

Harish Rao

Harish Rao

రాష్ట్ర వ్యాప్తంగా 16 వేలకు పైగా ఉన్న హోంగార్డులకు 12 రోజులు గడస్తున్నా.. ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు మండిపడ్డారు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫైర్ అయ్యారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చెయ్యాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు అంటూ ఎక్స్‌లో హరీశ్‌ రావు విమర్శలు చేశారు.

Also Read: IND vs ENG: నేడు ఇంగ్లండ్‌తో మూడో వన్డే.. కింగ్ బ్యాటింగ్‌పై సర్వత్రా ఆసక్తి!

‘రాష్ట్రవ్యాప్తంగా 16 వేలకు పైగా ఉన్న హోం గార్డులకు 12 రోజులు గడస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చెయ్యాల్సిన దుస్థితి నెలకొంది. ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్న పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేరు. మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటని ముఖ్యమంత్రి గారు వీరికి ఏం సమాధానం చెబుతారు?. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు.. ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. హోంగార్డులకు వేతనాలు తక్షణం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు పేర్కొన్నారు.