Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Brs Ministers Fires On Pm Modi Speech In Hyderabad

BRS Ministers: అభివృద్ధిపై చర్చకు ప్రధాని సిద్ధమా?.. ప్రధాని వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మంత్రులు

NTV Telugu Twitter
Published Date :April 8, 2023 , 5:46 pm
By Mahesh Jakki
BRS Ministers: అభివృద్ధిపై చర్చకు ప్రధాని సిద్ధమా?.. ప్రధాని వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మంత్రులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

BRS Ministers Fires on PM Modi: సికింద్రాబాద్‌లో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ మంత్రులు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం కోసం సికింద్రాబాద్‌ వచ్చిన ప్రధాని.. రాజకీయాలు చేయడం మంచిది కాదని మండిపడ్డారు. కుటుంబ పాలన ఉన్న పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై బీఆర్‌ఎస్ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన ప్రధాని రాజకీయాలు చేయడం మంచిది కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్న మంత్రి తలసాని.. ప్రధాని తమతో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఎందులో సహకరించలేదో ప్రధాని చెప్పాలన్నారు. హైదరాబాద్‌ వచ్చి మరీ తిట్టాలా.. దిల్లీలో కూర్చోని తిట్టొచ్చు కదా మంత్రి ఎద్దేవా చేశారు.

కేంద్రం ఏం అభివృద్ధి పనులు చేస్తుంటే అడ్డుకుంటున్నామో చెప్పాలని మంత్రి అన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే అవార్డులు ఎందుకు ఇస్తున్నారు. అవార్డులు ఇస్తున్నారు కానీ నిధులు మాత్రం ఇవ్వట్లేదన్నారు. అదానీపై జేపీసీ ఎందుకు ఏర్పాటు చేయట్లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. తెలంగాణలో ఏ ప్రాంతానికి వెళ్లినా అభివృద్ధి కనిపిస్తోందన్నారు. 24 గంటలు కరెంట్‌ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. 24 గంటల కరెంట్‌పై ప్రధాని మోదీ బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. బీజేపీలో కుటుంబ పాలన లేదా అంటూ మంత్రి ప్రశ్నించారు. భారత్‌ బయోటెక్‌కు ప్రధాని వచ్చినప్పుడు సీఎం కేసీఆర్‌ను ఎందుకు పిలవలేదని మంత్రి ప్రశ్నించారు. అక్కడి నుంచే కదా ప్రధాని-సీఎం మధ్య దూరం పెరిగిందంటూ మంత్రి తలసాని పేర్కొన్నారు. రాష్ట్రానికి మెడికల్‌ కళాశాలలు ఇస్తే ఎవరైనా కాదన్నారా అని ఆయన ధ్వజమెత్తారు. దేశానికి ఎక్కువ శాతం పన్నులు కడుతున్నది తెలంగాణ అని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణకు కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వలేదన్నారు.

Read Also: Ponnala Lakshmaiah : అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని రాజకీయాలు మాట్లాడారు

తెలంగాణపై కేంద్రానికి ఎందుకింత కక్ష అంటూ ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ మండిపడ్డారు. కుటుంబ పాలన ఉన్న పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోలేదా మంత్రి ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చేది గోరంత.. చెప్పుకునేది కొండంత అని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారే ఇప్పుడూ రాజకీయాల్లో ఉన్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు అవార్డులు ఎందుకు రావట్లేదని శ్రీనివాస్‌గౌడ్‌ ధ్వజమెత్తారు. తెలంగాణ నుంచి కూడా రైళ్లు వెళ్లాలి కాబట్టే.. వందేభారత్‌ ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా లేదని.. అప్పర్‌భద్రకు ఎందుకు ఇచ్చారని శ్రీనివాస్‌ గౌడ్ నిలదీశారు. రైతుల వద్ద పంట కొంటారా.. లేదా అనేది మోదీ మాట్లాడలేదని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణలో ఎక్కువ మంది వలస వచ్చిన వారు ఉంటారన్న ఆయన.. రేషన్‌ పెంచమని అడిగితే పెంచలేదన్నారు. కేంద్రం 10 ఏళ్లలో ఒక్క రేషన్‌కార్డు కూడా పెంచలేదని పేర్కొన్నారు. ప్రతి ఏడాది రేషన్‌కార్డులు పెంచుతూ.. 97 లక్షల మందికి రేషన్‌కార్డు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి గంగుల స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS Ministers
  • gangula kamalakar
  • hyderabad
  • Minister Srinivas Goud
  • PM Modi Hyderabad Tour

తాజావార్తలు

  • Telangana Formation Day: దశాబ్ధాల పోరాట ఫలితం.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం.. పూర్తి వివరాలు

  • Shiva Rajkumar : శివరాజ్ కుమార్ మెడకు చుట్టుకున్న.. కమల్ వివాదం

  • OG: ఇంత టెన్షన్లో కూడా పవన్ ను వదలట్లేదు!

  • Rakul: రకుల్‌ ప్రీత్‌కి హైదరాబాద్‌లో ఇల్లు గిఫ్ట్.. ఫైనల్లీ ఓపెనయ్యిందిగా!

  • Spider Web: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. సందేశం ఎవరికంటే..!

ట్రెండింగ్‌

  • Rohit Sharma: నన్ను ఔట్ చేయడం సాధ్యమే కాదు.. పిల్లలతో హిట్ మ్యాన్.. వీడియో వైరల్

  • Xiaomi: షావోమి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అలర్ట్.. ఆ ఫోన్లకు ఇకపై అప్డేట్లు ఉండవు..!

  • Vivo T4 Ultra: 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో భారత్ లో లాంచ్ కి సిద్దమైన వివో T4 అల్ట్రా..!

  • Viral Video: అంత ఆగలేకపోతున్నారా ఏంటి.. పబ్లిక్‌గా రొమాన్స్‌లో మునిగితేలిన యువత..!

  • Moto g86 Series: మోటొరోలా నుంచి మోటో G86 పవర్ 5G, మోటో G86 5G, మోటో G56 5G మూడు కొత్త 5G ఫోన్లు లాంచ్…!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions