Rakesh Reddy : రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాలన పడకేసింది అనుకున్నాం.. కానీ అటక్కేకింది
రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాలన పడకేసింది అనుకున్నాం…కానీ అటకెక్కిందన్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వానికి పిఆర్ స్టంట్ మీద ఉన్న సోయి…ప్రజా సమస్యలు పరిష్కరించడంలో లేదని, ఆశా వర్కర్లు, అంగన్ వాడీలు, గురుకుల టీచర్లు, ఆందోళన చేస్తుంటే పట్టింపు లేదు. రాష్ట్రంలో హత్యలు, హత్యాచారాలు జరుగుతుంటే పట్టించుకోవడం లేదన్నారు రాకేష్ రెడ్డి. జీవో 46 బాధితులను పట్టించుకోవడం లేదని, 60 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం వస్తె… 90 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం రాలేదని ఆయన విమర్శించారు. వారికి న్యాయం చేస్తామని మాటిచ్చారు. కాంగ్రెస్ కోసం పనిచేయాలని అన్నారని, ఇప్పుడు ఎన్నికలు ఐపోగానే మొహం చాటేశారని రాకేష్ రెడ్డి మండిపడ్డారు.
అంతేకాకుండా..’ఇప్పుడు జీవో 46 బాధితులు కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు.. ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్ రావుని కలిశారు.. వారి పక్షాన మేము సిఎస్ ను కలవడానికి వచ్చాం.. 10 రోజులుగా చూస్తున్నాం. అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.. ఈ ప్రభుత్వానికి చెప్పిన…గోడకు చెప్పిన ఒక్కటే అని వినతి పత్రం సెక్రటేరియట్ గోడకు అంటించి వచ్చాం జీవో 46 బాధితుల పక్షాన నిలుస్తున్నం. వారికి న్యాయం జరిగే వరకు మేము కొట్లడుతాం.. నేను ఎమ్మెల్సీగా ఓడిపోవచ్చు..ప్రజా క్షేత్రంలో ఉంటాం..చట్ట సభల్లో లెను…జన సభల్లో ఉంటా…బాధితులు పక్షాన నిలబడతా.. బీఆర్ఎస్ పార్టీ బాధితులకు అన్ని విధాల అండగా ఉంటుంది. వారి పక్షాన మేము పోరాటం చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వారిని ప్రజా భవన్ పిలుచుకొని, వారితో భోజనం చేసి వారి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం.. ప్రభుత్వాలు ఉద్యమాల వల్ల చట్టాలనే వెనక్కు తీసుకున్న సందర్బాలు ఉన్నాయి…ప్రజా పాలన అని చెబుతున్న రేవంత్ ప్రభుత్వం జీవో46 వెనక్కి తీసుకోవాలి..లేదా సవరణ చేయాలి.’ అని రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
- US-Iran talks: శాంతి చర్చల్లో అనిశ్చితి.. పాక్ నుంచి వెళ్లిపోయిన ఇరాన్ బృందం..
తాజావార్తలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
-
Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
-
RR vs SRH: బ్యాట్ తో మోత మోగించిన వైభవ్, జురెల్.. సన్రైజర్స్ ముందు భారీ లక్ష్యం
-
Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా…
-
Off The Record : కాకినాడలో ‘పేకాట’ జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!