Site icon NTV Telugu

BRS: రేపు కరీంనగర్లో ‘కథనభేరి’ సభ.. హాజరుకానున్న గులాబీ బాస్

Brs

Brs

రేపు కరీంనగర్లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ సభ నిర్వహించబోతుంది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ సభ వివరాలను తెలిపారు. రేపు సాయంత్రం 5:30 గంటలకి కరీంనగర్ లో కథనభేరి సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్య కార్యక్రమాలన్నీ కరీంనగర్ నుండే కేసీఆర్ ప్రారంభిస్తారు.. అదే సెంటిమెంట్ తో పార్లమెంట్ ఎన్నికల కథనభేరి కూడా కరీంనగర్ నుండే ప్రారంభం అవుతోందని గంగుల కమలాకర్ తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతికేత మొదలైందని, ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా గులాబీ శ్రేణులు నిలుస్తారని గంగుల పేర్కొన్నారు.

Read Also: Delhi: అన్ని రాష్ట్రాల అధికారులతో సీఈసీ భేటీ.. ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష

ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కేసీఆర్, గులాబీ జెండా ఎంతలా పోరాడిందో అందరికీ తెలుసని అన్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీలు పార్లమెంట్ లో ఉండాలని తెలిపారు. మేడిగడ్డ కుంగినాక మూడు నెలలుగా ప్రభుత్వం రిపేర్లు చేయడం లేదు.. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉంటే ఈ పాటికి తాత్కాలిక రిపేర్లు చేసేవారని పేర్కొన్నారు. ఓ వైపు పంట పొలాలు ఎండిపోతుంటే ప్రభుత్వం ఇంకా చూస్తేనే ఉంది.. నీళ్లు లేక ఎండిపోయిన పొలాలకి రైతులు నిప్పు పెట్టుకుంటున్నారని తెలిపారు. మేడిగడ్డ విషయంలో సమయం వృధా చేస్తూ వచ్చారు.. ఈ సమస్యలన్నీ రేపు బహిరంగ సభలో కేసీఆర్ ప్రస్తావిస్తారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

Read Also: BJP: సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్.. తెలంగాణలోని 8 స్థానాలపై క్లారిటీ

Exit mobile version