Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య ఆస్తులు పెరిగాయ్..
రిషి సునాక్ పేరు అందరికీ సుపరిచితమే. భారత సంతతికి చెందిన అతడు బ్రిటన్ ప్రధానిగా కొనసాగుతున్నారు. తాజాగా అతడు మరోసారి వార్తల్లోకెక్కారు. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి మరింత సంపన్నులు అయ్యారు. రెండేళ్ల క్రితం సండే టైమ్స్ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న వీరు, శుక్రవారం విడుదలైన జాబితాలో తమ ర్యాంకును మరింత మెరుగు పరచుకుని అత్యంత సంపన్నులైన బ్రిటన్ ప్రధానమంత్రి దంపతులుగా నిలిచారు.
READ MORE: Uttarpradesh : ప్రభుత్వం పై నమ్మకం లేదు.. 24గంటలూ ఈవీఎంలకు కాపలాగా నాయకులు
Also Read
అయితే.. ఇన్ఫోసిస్ కంపెనీలో అక్షతా మూర్తికి షేర్లు ఉన్నాయి. అవే వీరింత సంపన్నులు కావడానికి కారణం. సండే టైమ్స్ సంపన్నుల జాబితాలో ఈ దంపతులు గతేడాది 275వ స్థానంలో నిలిచిన విషయం విదితమే. తాజాగా ఈ ఏడాది సుమారు రూ.6,873 కోట్ల (651 మిలియన్ పౌండ్లు) సంపదతో ర్యాంకును మెరుగు పరచుకుని 245వ స్థానానికి చేరుకున్నారు. 2022-23లో రిషి సునాక్ సుమారు రూ.23 కోట్లు (2.2 మిలియన్ పౌండ్లు) సంసాదించగా, ఆయన సతీమణి అక్షతామూర్తి డివెండెండ్ల రూపంలో ఏకంగా రూ.137 కోట్లు (13 మిలియన్ పౌండ్లు) కూడగట్టుకున్నారు. వీరి ఆస్తిలో సింహభాగం అక్షతామూర్తికి ఇన్ఫోసిస్లో ఉన్న షేర్లే కావడం విశేషం. భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ లో సంపన్నుల జాబితాలో చోటు సాధించడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
2022లో బిలియనీర్ల గరిష్ఠ సంఖ్య 177 కాగా.. ఈ ఏడాది 165కి పడిపోయింది. ఈ క్షీణతకు కారణం కొంతమంది బిలియనీర్లు అధిక రుణ రేట్లు కారణంగా వారి సంపద మంచులా కరిగిపోగా.. మరికొందరు దేశం విడిచిపెట్టారని బ్రిస్టల్ లైవ్ నివేదించింది . బ్రిటన్లోని 350 మంది కుబేరులు ఉండగా.. ఆ కుటుంబాల మొత్తం సంపద 795.36 బిలియన్లుగా ఉందని తాజా గణాంకాలు చూపిస్తున్నాయి. ఈ సంవత్సరం యూకే బిలియనీర్ల జాబితాలో హిందుజా గ్రూప్ అధినేత గోపీచంద్ హిందూజా, అతని కుటుంబం నిలిచింది. హిందూజా కుటుంబం సంపద ఈ ఏడాది 35 బిలియన్ యూరోల నుండి 37.2 బిలియన్ యూరోలకు పెరిగింది.
తాజావార్తలు
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!