NTV Telugu Site icon

Earthquake: భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్‌ లలో భూకంప ప్రకంపనలు..

Earthquake

Earthquake

Earthquake: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది. అందిన సమాచారం మేరకు భూకంప కేంద్రం పాకిస్థాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈరోజు భూకంపం సంభవించింది. భారత్‌తో పాటు పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నివేదిక ప్రకారం, ఖైబర్ పఖ్తుంక్వా నుండి పంజాబ్ వరకు ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం డేరా ఘాజీ ఖాన్ సమీపంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల దిగువన ఉంది. దీని కారణంగా తీవ్రత తక్కువగా కనిపించింది.

Rohit Sharma: రోహిత్ ఇంట్రెస్టింగ్ వీడియో.. 99% వర్కౌట్ టైమ్.. ఆ 1% అలా..

ప్రస్తుతం భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లలో ఎక్కడ ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు లేవు. ఢిల్లీ, పశ్చిమ యూపీ, హర్యానా, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో ఈ భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, భూకంపం సమయం 12:58 నిమిషాలకు నమోదైంది. భూకంప తీవ్రత 6 కంటే తక్కువగా ఉంటే పెద్దగా ప్రమాదం ఉండదని సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. కానీ ఈ భూకంపం యొక్క కేంద్రం భూమికి చాలా దిగువన లేదు. కాబట్టి, ఇది ప్రమాదకరంగా ఉండవచ్చు. అయితే ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.

Delhi Traffic Jam : వర్షంతో ఢిల్లీ రోడ్లు జామ్.. కిలోమీటర్ల మేర వాహనాల క్యూ

భూకంప తీవ్రత 5.8 కాదని, 5.4గా ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. పాకిస్థాన్ పంజాబ్‌లోని చాలా నగరాల్లో దీని ప్రభావం కనిపిస్తోంది. వీటిలో మియాన్‌వాలి, ఖనేవాల్, తోబా టేక్ సింగ్, గుజరాత్, సర్గోధా, ఝాంగ్ ఉన్నాయి. దీంతో పాటు రాజధాని ఇస్లామాబాద్, ముల్తాన్, లాహోర్‌లలో కూడా భూకంపం సంభవించింది. ఖైబర్ ఫక్తుంఖ్వాలోని పెషావర్‌తో పాటు స్వాత్ వ్యాలీ, ఉత్తర వజీరిస్థాన్ తదితర ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించింది.