Site icon NTV Telugu

Botsa Satyanarayana: దేవుడి పేరుతో రాజకీయాలు చేయవద్దు!

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తాజాగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వివిధ అంశాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైనదికాదని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కమిటీలు, దర్యాప్తుల వ్యవహారంలో స్పష్టత లేకుండా రాజకీయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Jowar Roti with Red Chilli: ఎర్ర కారంతో జొన్న రొట్టె తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..!

ప్రభుత్వానికి నిజంగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశం ఉంటే డిప్యూటీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పాత పార్టీ అధ్యక్షురాలు లేదా చంద్రబాబు కుమారుడితో కమిటీ ఏర్పాటు చేసి ఫైండింగ్స్ ఇవ్వమని చెప్పాలని చురకలనంటించారు. ఏకసభ్య కమిషన్‌లు ఏర్పాటు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. శ్యామలరావును ప్రక్షాళన కోసం నియమించారని.. NDDB, NDRI ల్యాబ్ నివేదికలు ఉన్నాయని గుర్తుచేశారు. ఆ తరువాత అదే అంశంపై కోర్టుకు వెళ్లడం ఎందుకని ప్రశ్నించారు.

సీబీఐ సిట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అధికారులు కూడా ఉన్నారని, అందరూ కలిసి ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆ నివేదిక బయటకు వస్తే జంతు కొవ్వు ఉందా లేదా అన్నది ప్రజలకు స్పష్టమవుతుందని అన్నారు. cచేయవద్దని బొత్స సత్యనారాయణ సూచించారు. ప్రతిరోజూ భక్తులు ప్రసాదం తీసుకుంటారని, వారి విశ్వాసాలను దెబ్బతీయకూడదన్నారు. “దేవుడు అన్నీ చూస్తాడు, తప్పు చేస్తే శిక్షిస్తాడు” ఇలాంటి మాటలు ఆపండి అని అన్నారు. చట్టం తన పని తాను చేసుకునేలా అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు.

Blood Fall: మంచు కొండల నుంచి కారుతున్న రక్తం.. ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రకృతి రహస్యం!

ముఖ్యమంత్రి చంద్రబాబు తాను చెప్పిందే నిజం అన్నట్లుగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, గ్రామాల్లో ఉన్న మహిళలను అడిగినా ప్రభుత్వ పనితీరు గురించి చెప్తారని అన్నారు. వైఎస్ జగన్ పర్యటనలకు వస్తే అనేక కేసులు నమోదు చేస్తున్నారని, వాటిని చట్టపరంగా ఎదుర్కుంటామని బొత్స స్పష్టం చేశారు. ఎవరి ముందు తలవంచే పరిస్థితి లేదన్నారు. ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న ఈ రాజకీయ సంస్కృతి మంచిది కాదని వ్యాఖ్యానించారు.

Exit mobile version