Botsa Satyanarayana: ఉచిత ఇసుక విధానంలో లోపాలు.. బొత్స కీలక వ్యాఖ్యలు
- కొత్త ఇసుక విధానంలో లోపాలు
- ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: కొత్త ఇసుక విధానంలో లోపాలున్నాయని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక కొరత, ధరలను రాజకీయ కోణంలో కాకుండా ప్రజల ఇబ్బందులన దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నామన్నారు. ఉచిత ఇసుక అన్నప్పుడు సీవరేజ్ టాక్స్ అవసరం ఉండదన్నారు. ఉచిత ఇసుకకు వక్ర భాష్యం చెప్పే దోచుకుంటున్నారో బహిర్గతం అవ్వాలన్నారు. ఉచితం అన్నప్పుడు గతం కంటే తక్కువకు అమ్మాలో వద్దో ప్రభుత్వమే చెప్పాలన్నారు. ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేనప్పుడు గతం కంటే 3 వేల కంటే తక్కువకు అమ్మాలి కానీ ఎలా పెంచి అమ్ముతున్నారని ప్రశ్నించారు.
Read Also: Minister BC Janardhan Reddy: రూ.290 కోట్లతో రాష్ట్ర రహదారులకు మరమ్మతులు
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
ప్రభుత్వం పరిపాలన ప్రారంభించడానికి నాలుగు నెలల సమయం పట్టిందన్నారు. ఈ క్రమంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ రంగంపై ఆధారపడ్డ 25రకాల పనులు చేసేవాళ్ళ భవిష్యత్ అగమ్య గోచరంగా ఉందన్నారు. ఇసుక మూడు యూనిట్లు 9-10 వేల మధ్య ఇంటి గుమ్మంలోకి తెచ్చి ఇచ్చే వాళ్లు అని, గాజువాకలో అయితే 14-15వేలకు లభించేదని వెల్లడించారు. ఈ ప్రభుత్వంలో ఇసుక విజయనగరంలో 17-18వేలు అయితే మధురవాడలో 19-20వేలకు, వైజాగ్లో అయితే 22వేల రూపాయలు పలుకుతోందని బొత్స సత్యనారాయణ అన్నారు. నిత్యావసరాల ధరలు 25 – 30 రూపాయలు కేజీ మీద పెరిగాయని పేర్కొన్నారు. ధరల నియంత్రణకు మార్కెటింగ్, సివిల్ సప్లైస్ మంత్రిత్వశాఖలు పని చేయాలన్నారు. దేశం అంతా ధరలు నియంత్రణ లేనప్పుడే ప్రభుత్వాల పని తనం తేలేదంటూ చెప్పుకొచ్చారు.
విశాఖకు డ్రగ్స్ దిగుమతుల కేసులో సీబీఐ చేపట్టిన దర్యాప్తు పురోగతి ఏమైందని ప్రశ్నించారు. ఈ కేసులో తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి, డీజీపీకి లేఖ రాస్తానన్నారు. స్టీల్ ప్లాంట్పై మా చిత్త శుద్ధి మాకు తెలుసన్నారు. కూటమి పార్టీలు ఎన్ని అనుకున్నా ప్లాంట్ పరిరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. సంధ్య ఆక్వా సంస్థకు వచ్చింది.. అది పురంధేశ్వరి బంధువులదని తేలిందన్నారు. మా ప్రభుత్వం అడ్డుపడిన కారణంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ముందుకు వెళ్ళకుండా అడ్డుకున్నామని బొత్స పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!