INDIAN ARMY: ఆర్మీ, నేవీ చీఫ్లిద్దరూ స్నేహితులే.. ఒకే పాఠశాలలో విద్యాభ్యాసం
- లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.. అడ్మిరల్ దినేష్ త్రిపాఠి అనే ఇద్దరు సహవిద్యార్థులు
- మధ్యప్రదేశ్లోని సైనిక్ స్కూల్ రేవాలో విద్యాభ్యాసం
- అధికారుల రోల్ నంబర్లు సైతం దగ్గరగానే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత సైన్యం చరిత్రలో తొలిసారిగా అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. ఇద్దరు మిత్రులు ఆర్మీ, నేవీకి చీఫ్ లుగా నియమితులయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.. అడ్మిరల్ దినేష్ త్రిపాఠి అనే ఇద్దరు సహవిద్యార్థులు భారత సైన్యం నావికాదళానికి చీఫ్లుగా నియమితులయ్యారు. మధ్యప్రదేశ్లోని సైనిక్ స్కూల్ రేవాకు చెందిన నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, ఆర్మీ చీఫ్గా నియమించబడిన లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది 1970ల ప్రారంభంలో 5వ తరగతి నుంచి కలిసి చదువుకున్నారు. ఇద్దరు అధికారుల రోల్ నంబర్లు కూడా ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయి. లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది రోల్ నంబర్ 931, అడ్మిరల్ త్రిపాఠి 938. ఇద్దరూ స్కూల్ డేస్ నుంచి మంచి స్నేహితులు. సైన్యంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, వారు ఎల్లప్పుడూ టచ్లో ఉంటారు.
READ MORE: Rautu Ka Raaz: ZEE5లో ఇంట్రెస్టింగ్ మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రౌతు కా రాజ్’ స్ట్రీమింగ్
Also Read
- RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
- Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
- Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
సైన్యంలోని సీనియర్ నాయకత్వం మధ్య బలమైన స్నేహం, సేవల మధ్య పని సంబంధాన్ని బలోపేతం చేయడానికి చాలా దోహదపడుతుందని ఇద్దరు అధికారుల గురించి తెలిసిన ఒక రక్షణ అధికారి చెప్పారు. 50 ఏళ్ల తర్వాత తమ సైన్యానికి నాయకత్వం వహించే ఇద్దరు ప్రతిభావంతులైన విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఈ అరుదైన గౌరవం మధ్యప్రదేశ్లోని రేవాలోని సైనిక్ స్కూల్కు దక్కుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి భరత్ భూషణ్ బాబు ట్వీట్లో తెలిపారు. క్లాస్మేట్స్ ఇద్దరి నియామకాలు కూడా దాదాపు రెండు నెలల తేడాతో ఒకేసారి జరిగాయి. అడ్మిరల్ మే 1న భారత నావికాదళానికి నాయకత్వం వహించగా.. లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది ఆదివారం తన కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు.
ప్రస్తుతం డిప్యూటీ ఆర్మీ చీఫ్గా పనిచేస్తున్న లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది జూన్ 30, 2024న తన కొత్త బాధ్యతలను స్వీకరించనున్న విషయం తెలిసిందే. ఆర్మీ వైస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించే ముందు.. అతను 2022 నుంచి 2024 వరకు ఉధంపూర్లో ఉన్న నార్తర్న్ కమాండ్కు జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (GOC-in-C) గా ఉన్నారు. లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది 1984లో 18 జమ్మూ మరియు కాశ్మీర్ (J&K) రైఫిల్స్గా నియమించబడ్డారు. దీని తర్వాత అతను ఈ యూనిట్కు నాయకత్వం వహించారు.
తాజావార్తలు
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
-
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
-
Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!