INDIAN ARMY: ఆర్మీ, నేవీ చీఫ్లిద్దరూ స్నేహితులే.. ఒకే పాఠశాలలో విద్యాభ్యాసం
- లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.. అడ్మిరల్ దినేష్ త్రిపాఠి అనే ఇద్దరు సహవిద్యార్థులు
- మధ్యప్రదేశ్లోని సైనిక్ స్కూల్ రేవాలో విద్యాభ్యాసం
- అధికారుల రోల్ నంబర్లు సైతం దగ్గరగానే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత సైన్యం చరిత్రలో తొలిసారిగా అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. ఇద్దరు మిత్రులు ఆర్మీ, నేవీకి చీఫ్ లుగా నియమితులయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.. అడ్మిరల్ దినేష్ త్రిపాఠి అనే ఇద్దరు సహవిద్యార్థులు భారత సైన్యం నావికాదళానికి చీఫ్లుగా నియమితులయ్యారు. మధ్యప్రదేశ్లోని సైనిక్ స్కూల్ రేవాకు చెందిన నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, ఆర్మీ చీఫ్గా నియమించబడిన లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది 1970ల ప్రారంభంలో 5వ తరగతి నుంచి కలిసి చదువుకున్నారు. ఇద్దరు అధికారుల రోల్ నంబర్లు కూడా ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయి. లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది రోల్ నంబర్ 931, అడ్మిరల్ త్రిపాఠి 938. ఇద్దరూ స్కూల్ డేస్ నుంచి మంచి స్నేహితులు. సైన్యంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, వారు ఎల్లప్పుడూ టచ్లో ఉంటారు.
READ MORE: Rautu Ka Raaz: ZEE5లో ఇంట్రెస్టింగ్ మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రౌతు కా రాజ్’ స్ట్రీమింగ్
Also Read
- Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
సైన్యంలోని సీనియర్ నాయకత్వం మధ్య బలమైన స్నేహం, సేవల మధ్య పని సంబంధాన్ని బలోపేతం చేయడానికి చాలా దోహదపడుతుందని ఇద్దరు అధికారుల గురించి తెలిసిన ఒక రక్షణ అధికారి చెప్పారు. 50 ఏళ్ల తర్వాత తమ సైన్యానికి నాయకత్వం వహించే ఇద్దరు ప్రతిభావంతులైన విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఈ అరుదైన గౌరవం మధ్యప్రదేశ్లోని రేవాలోని సైనిక్ స్కూల్కు దక్కుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి భరత్ భూషణ్ బాబు ట్వీట్లో తెలిపారు. క్లాస్మేట్స్ ఇద్దరి నియామకాలు కూడా దాదాపు రెండు నెలల తేడాతో ఒకేసారి జరిగాయి. అడ్మిరల్ మే 1న భారత నావికాదళానికి నాయకత్వం వహించగా.. లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది ఆదివారం తన కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు.
ప్రస్తుతం డిప్యూటీ ఆర్మీ చీఫ్గా పనిచేస్తున్న లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది జూన్ 30, 2024న తన కొత్త బాధ్యతలను స్వీకరించనున్న విషయం తెలిసిందే. ఆర్మీ వైస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించే ముందు.. అతను 2022 నుంచి 2024 వరకు ఉధంపూర్లో ఉన్న నార్తర్న్ కమాండ్కు జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (GOC-in-C) గా ఉన్నారు. లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది 1984లో 18 జమ్మూ మరియు కాశ్మీర్ (J&K) రైఫిల్స్గా నియమించబడ్డారు. దీని తర్వాత అతను ఈ యూనిట్కు నాయకత్వం వహించారు.
తాజావార్తలు
-
Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!