Bengal Panchayat Polls: ముర్షిదాబాద్లో బాంబు పేలుడు.. చిన్నారులు బంతి అని ఆడుకుంటుండగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Panchayat Polls: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలకు ముందు ముర్షిదాబాద్ జిల్లాలో ఒకే రోజు రెండు బాంబు పేలుళ్లు జరిగాయి. ఒక సంఘటనలో ఐదుగురు చిన్నారులు బాంబును బంతిగా భావించి ఆడుకుంటుండగా పేలుడు సంభవించి గాయపడ్డారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు ముందు పేలుడు ధాటికి తృణమూల్ మద్దతుదారుడి ఇల్లు ఎగిరిపోయింది. సోమవారం జరిగిన ఈ ఘటనతో ముర్షిదాబాద్లోని రాణినగర్లోని నజ్రానా గ్రామానికి చెందిన నబీర్పాడ సర్కార్ పాడాలో సంచలనం రేగింది.
ముర్షిదాబాద్లోని ఫరక్కాలో ఈరోజు ఉదయం కూడా పేలుడు సంభవించి ఐదుగురు చిన్నారులు గాయపడ్డారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పుడు అదే జిల్లాలోని మోఫిజుల్ మొల్లా ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. పోలీసులు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. హడావుడిగా పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో బెంగాల్ పోలీసు సిబ్బందిని మోహరించారు.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
Read Also:Basara IIIT: బాసర ఆర్జీయూకేటీ ప్రవేశ దరఖాస్తు తేదీ పొడిగింపు
పేలుడు జరిగిన ఇంటిలోని ఇద్దరు సభ్యులు పరారీలో ఉన్నట్లు సమాచారం. పేలుడు జరిగినప్పటి నుంచి వారి గురించి ఎలాంటి సమాచారం లేదు. కాంగ్రెస్కు చెందిన హసిబుర్ రహ్మాన్ మజ్రుల్ ఇస్లాం మండల్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో భయాందోళనలు సృష్టించేందుకు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు బాంబులు తయారు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో కనీసం ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని ఆయన పేర్కొన్నారు. అయితే, మోఫిజుల్ ఇంటికి చెందిన లీలా బీబీ అనే మహిళ మాట్లాడుతూ, “మేము తోటలో ఉండగా, అకస్మాత్తుగా బాంబు పేలుడు శబ్దం వినిపించింది. ఎవరో బాంబు విసిరి పారిపోయినట్లు కనిపిస్తోంది. పెద్ద శబ్దంతో మేము కూడా భయపడ్డాము. అయితే, ఇంట్లోని మోఫిజుల్ ఇస్లాం, అతని తండ్రి నబీ ముల్లా ఎక్కడ ఉన్నారో ఆమె చెప్పలేకపోయింది.
Read Also:Jagadish Shettar: కర్ణాటక ఎమ్మెల్సీ ఉపఎన్నికల బరిలో జగదీష్ షెట్టర్
ఘటన జరిగినప్పటి నుంచి మోఫిజుల్, అతని తండ్రి నబీ మొల్లా పరారీలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మరో యువకుడు తాజిముద్దీన్ షేక్ మాట్లాడుతూ, ‘ఆ సమయంలో పోలీసు వాహనం ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తోంది. అంతలో బాంబు పేలుడు సంభవించింది’ అని తెలిపాడు. బెంగాల్లో ఎన్నికల హింసాకాండ మధ్య, ప్రతిపక్ష పార్టీలు ముర్షిదాబాద్లో శాంతిభద్రతల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. కేంద్ర బలగాలను మోహరించాలని పట్టుబట్టాయి. అయితే కేంద్ర బలగాల మోహరింపు వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!