CBSE: సీబీఎస్ఈ పరీక్షల రద్దు ప్రచారంపై బోర్డు క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ (CBSE Board) బోర్డు 10, 12 తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షల ప్రారంభానికి ముందే దేశ రాజధాని ఢిల్లీకి అన్నదాతలు కదంతొక్కారు. పెద్ద ఎత్తున రైతులు హస్తినకు తరలివచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఉద్రిక్తతంగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా రైతుల ఆందోళన నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలు రద్దు అయ్యాయంటూ ఓ సర్క్యులర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో CBSE బోర్డు స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న నకిలీ లేఖను CBSE బోర్డు ఖండించింది.
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
పరీక్ష తేదీల్లో మార్పు చేసినట్లు ఉన్న నకిలీ సమాచారంపై పాఠశాలలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్ని అప్రమత్తం చేసింది. అలాంటి నకిలీ లేఖను నమ్మొద్దని విద్యార్థులను బోర్డు కోరింది.
కనీస మద్దతు ధర సహా పలు డిమాండ్ల సాధన కోసం రైతులు చేపట్టిన ఆందోళన కారణంగా 12వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని బోర్డు నిర్ణయం తీసుకుందని.. పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామంటూ ప్రిన్సిపాళ్లకు అడ్రస్ చేస్తూ సీబీఎస్ఈ బోర్డు పేరిట ఓ నకిలీ లేఖ హల్చల్ చేసింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. అలాంటి సమాచారాన్ని నమ్మొద్దని అధికారిక ‘ఎక్స్’ వేదికగా విజ్ఞప్తి చేసింది. అప్రమత్తంగా ఉండండి.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ లేఖ నకిలీ అని కొట్టిపారేసింది.
దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు గురువారం నుంచి మొదలయ్యాయి. భారత్తో పాటు 27 దేశాల్లో దాదాపు 39 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. రైతుల చలో ఢిల్లీ ఆందోళన నేపథ్యంలో దేశ రాజధాని నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నందున విద్యార్థులు ఇంటి నుంచి త్వరగా బయల్దేరి పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని కోరింది. అలాగే‘ఎక్స్’లో CBSE పేరుతో అనేక నకిలీ ఖాతాలు ఉన్నాయని.. వాటిని ఫాలో కావొద్దని కోరింది.
#CBSE FACT CHECK!
Beware! The following letter under circulation is FAKE and misleading. The board has not taken any such decision. pic.twitter.com/30CKR3VffO— CBSE HQ (@cbseindia29) February 16, 2024
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!