CBSE: సీబీఎస్ఈ పరీక్షల రద్దు ప్రచారంపై బోర్డు క్లారిటీ
దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ (CBSE Board) బోర్డు 10, 12 తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షల ప్రారంభానికి ముందే దేశ రాజధాని ఢిల్లీకి అన్నదాతలు కదంతొక్కారు. పెద్ద ఎత్తున రైతులు హస్తినకు తరలివచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఉద్రిక్తతంగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా రైతుల ఆందోళన నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలు రద్దు అయ్యాయంటూ ఓ సర్క్యులర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో CBSE బోర్డు స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న నకిలీ లేఖను CBSE బోర్డు ఖండించింది.
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
పరీక్ష తేదీల్లో మార్పు చేసినట్లు ఉన్న నకిలీ సమాచారంపై పాఠశాలలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్ని అప్రమత్తం చేసింది. అలాంటి నకిలీ లేఖను నమ్మొద్దని విద్యార్థులను బోర్డు కోరింది.
కనీస మద్దతు ధర సహా పలు డిమాండ్ల సాధన కోసం రైతులు చేపట్టిన ఆందోళన కారణంగా 12వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని బోర్డు నిర్ణయం తీసుకుందని.. పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామంటూ ప్రిన్సిపాళ్లకు అడ్రస్ చేస్తూ సీబీఎస్ఈ బోర్డు పేరిట ఓ నకిలీ లేఖ హల్చల్ చేసింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. అలాంటి సమాచారాన్ని నమ్మొద్దని అధికారిక ‘ఎక్స్’ వేదికగా విజ్ఞప్తి చేసింది. అప్రమత్తంగా ఉండండి.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ లేఖ నకిలీ అని కొట్టిపారేసింది.
దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు గురువారం నుంచి మొదలయ్యాయి. భారత్తో పాటు 27 దేశాల్లో దాదాపు 39 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. రైతుల చలో ఢిల్లీ ఆందోళన నేపథ్యంలో దేశ రాజధాని నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నందున విద్యార్థులు ఇంటి నుంచి త్వరగా బయల్దేరి పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని కోరింది. అలాగే‘ఎక్స్’లో CBSE పేరుతో అనేక నకిలీ ఖాతాలు ఉన్నాయని.. వాటిని ఫాలో కావొద్దని కోరింది.
#CBSE FACT CHECK!
Beware! The following letter under circulation is FAKE and misleading. The board has not taken any such decision. pic.twitter.com/30CKR3VffO— CBSE HQ (@cbseindia29) February 16, 2024
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!