Fire Accident: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి..25మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోలాపూర్ జిల్లాలోని బార్షి తాలూకాలోని షిరాలే-పాంగ్రీ పరిధిలో ఉన్న సోభే మద్యం ఫ్యాక్టరీలో కొత్త సంవత్సరం తొలిరోజు భారీ పేలుడు సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం పేలుడులో ఐదుగురు మరణించారని, 20 నుంచి 25 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బార్షి తాలూకాలోని షిరాలే-పాంగ్రీ ప్రాంతంలో ఆర్నమెంటల్ మద్యం ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ పటాకులు, మందుగుండు సామాగ్రిని తయారు చేస్తారు.
Read Also: Blink It: ‘బ్లింకిట్’కే మైండ్ బ్లాక్ అయ్యే ఆర్డర్ ఇచ్చిన బెంగుళూరు వాసి
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ ప్రదేశంలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు శబ్ధం కనీసం ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న బార్షీ అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆ వెంటనే పోలీసు బృందం కూడా సహాయక చర్యల్లో పాల్గొంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున పేలుళ్లు జరగడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో సహాయక చర్యలు కష్టతరంగా మారుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు, 4 మృతదేహాలను ఫ్యాక్టరీ నుంచి బయటకు తీయగా, గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!