BJYM Bhanu Prakash : అవినీతికి కేరాఫ్ గా కేసీఆర్ మారారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ భారీ బహిరంగ సభ అనంతరం రాజకీయాల్లో పలు మార్పులకు నాందిగా మారిందన్నారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదని, కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని, ఆయనకు బదులు మంత్రులను పంపించారన్నారు. అవినీతికి కేరాఫ్ గా కేసీఆర్ మారారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘టీఎస్పీఎస్సీ లీకేజీపై కూడా కేసీఆర్ కనీసం నోరు మెదపలేదని, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు అన్ని పరీక్షలు లీక్ అయినట్లుగా అందరూ భావిస్తున్నారని, ఉద్యమంలో తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటే.. నేడు స్వరాష్ట్రంలో నోటిఫికేషన్లు రావని ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పదో తరగతి పేపర్ లికేజీలో కావాలని బండి సంజయ్ ని ఇరికించారు. న్యాయస్థానం మొట్టికాయలు వేస్తే కానీ సర్కారు తీరు మారట్లేదు. జైల్లో వేసినా, తూటాలు దించినా నిరుద్యోగుల తరుపున పోరాడుతాం. టెన్త్ పేపర్ లీకేజీలో ఉన్నది మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కవిత లిక్కర్ స్కామ్, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశాన్ని దృష్టి మళ్లించడానికే.. బండి పై లేనిపోని ఆరోపణలు. సోమవారం నుంచి కోచింగ్ సెంటర్లు, యూనివర్సిటీలు, కాలేజీలకు వెళ్లి bjym ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపడుతున్నాం.’ అని ఆయన అన్నారు.
Also Read : Madhya Pradesh: అన్నా చెల్లెల క్యారెక్టర్పై అనుమానం.. చెట్టుకు కట్టేసి అమానుషం..
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
అనంతరం.. గిరిజన మోర్చా అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. ‘బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో పోతోంది. అది కేవలం బిజినెస్ కోసమే.. డబ్బు సంపాదించుకునేందుకు మాత్రమే. గిరిజన రిజర్వేషన్లు పెంచలేదు. పిసా చట్టం అమలు అంటాడు.. పోడు పట్టాలు ఇస్తామని మోసం చేశాడు. గిరిజన ఎమ్మెల్యేలు, మంత్రులు గొర్రెల లాగా మారారు. ఇప్పుడు 10 వేలు ఇస్తే 24 గంటలు వైన్స్ ఓపెన్ చేసుకునేందుకు జీవో ఇచ్చావు. తాగుబోతుల తెలంగాణగా మార్చావు.’ అని అన్నారు.
Also Read : Mosquito Liquid: విషాదం.. మస్కిటో లిక్విడ్ తాగి ఏడాదిన్నర బాలుడు మృతి
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!