తమిళి సై, అన్నామలై గొడవకు శుభం కార్డు పడింది. లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో పార్టీ ఘోరంగా పరాజయం పాలైన నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య విభేదాలు తలెత్తినట్లు ఊహాగానాలు వచ్చాయి. లోక్సభ ఎన్నికల తర్వాత.. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఉంటే తమిళనాడులో పార్టీ మెరుగైన పనితీరు కనబరిచేదని సౌందరరాజన్ అన్నారు. బిజెపి-ఎఐఎడిఎంకె విడిపోవడానికి అన్నామలై కారణమని తమిళి సై ఆరోపించారు.
-
య్యి సంవత్సరాలన నాటి మరుగుదొడ్లు ఎలా ఉండేవో తెలుసా? ఈ కోటలో చూడండి..
అయితే.. జూన్ 9న చంద్రబాబు ప్రమాణస్వీకారత్సోవానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. వేదికపైనే తమిళిసై పై సీరియస్ అయినట్లు ఓ వీడియోలో కనిపించింది. అన్నామలైపై ఆమె అన్న మాటలకు షా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో తమిళిసై ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి ఏపీలో హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత ఫాలోఅప్, ఎదుర్కొన్న సవాళ్లు గురించి అడిగి తెలుసుకోవడానికి పిలిచారని చెప్పారు. తాను వివరిస్తున్నానని.. సమయం తక్కువగా ఉన్నందున.. రాజకీయ, నియోజకవర్గ పనులు చూసుకోవాలని సలహా ఇచ్చారని చెప్పుకోచ్చారు. కానీ ఏదో జరిగినట్లుగా ఊహాగానాలు సృష్టించారని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఈరోజు.. సీన్ మొత్తం మారిపోయింది. తమిళిసై ఇంటికి అన్నామలై వెళ్లి మాట్లాడారు. ఈ విషయాన్ని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్వయంగా తెలిపారు. ఇకపై నుంచి.. తమిళిసైతో విభేదాలు ముగిసినట్టేనని ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా.. ఇరువురూ కలిసిన ఫొటోను అన్నామలై షేర్ చేశారు.
ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని 39 స్థానాలకుగానూ 22 స్థానాలను డీఎంకే గెలుచుకోగా, దాని మిత్రపక్షం కాంగ్రెస్ తొమ్మిది స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రంలో బీజేపీ ఖాతా తెరవలేదు. దక్షిణ చెన్నై లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన తమిళిసై సౌందరరాజన్, అటు కోయంబత్తూర్ నుంచి పోటీ చేసిన అన్నామలై ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే.