BJP MP Laxman: రాముడే లేడని మాట్లాడిన కాంగ్రెస్ కావాలా?.. రాముడికి గుడి కట్టిన మోడీ కావాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Vijaya Sankalpa Yatra: రాముడే లేడని మాట్లాడిన కాంగ్రెస్ కావాలా? లేదా రాముడికి గుడి కట్టిన ప్రధాని నరేంద్ర మోడీ కావాలా? అని ప్రజలు ఆలోచించుకోవాలని బీజేపీ ఎంపీ డా లక్ష్మణ్ అన్నారు. హిందువుల కోసం అయోధ్య రామమందిర నిర్మాణాన్ని చేపట్టిన గొప్ప వ్యక్తి మన నరేంద్ర మోడీ అని పేర్కొన్నారు. ట్రిపుల్ తలక్ రద్దు చేసి ముస్లిం మహిళలకి అన్నగా నిలిచిన వ్యక్తి మన మోడీ అని అన్నారు. పాత బస్తీ బాగుపడాలంటే బీజేపీని గెలిపించాల్సిందే అని లక్ష్మణ్ ప్రజలను ఉద్దేశించి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలతో కమలదళం ముందుకెళ్తోంది. రాష్ట్ర నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. నేడు ఎంపీ డా లక్ష్మణ్ గౌలిపురాలో విజయ సంకల్ప యాత్ర చేశారు.
గౌలిపురాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర నేపథ్యంలో పాత బస్తీ మొత్తం కాషాయ మయంగా మారింది. గౌలిపురాలో ఎంపీ డా లక్ష్మణ్ మాటాడుతూ… ‘ప్రధాని మోడీని మూడోసారి ప్రధాని చేయాలని ప్రజల మద్దతు కూడగట్టుకుంటూ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించాము. విజయ సంకల్ప యాత్రకు గ్రామాల్లో, పట్టణాల్లో ఘన స్వాగతం పుకుతున్నారు. ట్రిపుల్ తలక్ రద్దు చేసి ముస్లిం మహిళలకి అన్నగా నిలిచిన వ్యక్తి మన మోడీ. హిందువుల కోసం అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని చేపట్టిన గొప్ప వ్యక్తి మన నరేంద్ర మోడీ. రాముడే లేదు.. రామునికి గుడి ఎందుకు అని కాంగ్రెస్ పార్టీ అంది. ఇపుడు రాజకీయం కోసం దేవుడి పేరు వాడుకుంటున్నారు. రాముడే లేడని మాట్లాడిన కాంగ్రెస్ కావాలో?, రాముడికి గుడి కట్టిన మోడీ కావాలో ప్రజలు ఆలోచించాలి’ అని అన్నారు.
Also Read
- 55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
- Modi - Meloni - Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
- Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా 'Rupee'.. పతనానికి అసలు కారణం ఇదే..
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
‘కర్ణాటక ఎమ్మెల్సీ నసీర్ షా గెలిచిన సందర్భంగా పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. మన దేశంలో ఉంటూ, మన దేశ తిండి తింటూ, మన ప్రజలతో ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్ దేశంకి జిందాబాద్ అనడం సిగ్గు చేటు. కాంగ్రెస్ అధిష్టానం వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దేశం సస్యసామలంగా ఉండాలంటే మోడీ ప్రభుత్వంతోనే సాధ్యం. నేను ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడుగా ఉన్నాను. అక్కడ సీఎం యోగి అధిత్యనాథ్ గ్యాంగ్ స్టార్స్ మాఫియాను బుల్డోజర్లతో కూల్చేశారు. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే హైదరాబాద్ నగరంలో బీజేపీని గెలిపిస్తే సస్యసామలంగా మారుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓవైసీ తొత్తులుగా మారి.. పాత బస్తిని డెవలప్ జరగకుండా చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం కోసం పని చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం కోసం పని చేస్తుంది. కానీ బీజేపీ పార్టీ మాత్రం ప్రజల కోసం, దేశం కోసం పని చేస్తుంది. పాతబస్తీ బాగుపడాలంటే బీజేపీని గెలిపించాల్సిందే’ అని ఎంపీ డా లక్ష్మణ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Chiru158: చిరు158కి థమన్ ఫిక్స్.. మెగా మాస్కి మ్యూజికల్ బ్లాస్ట్ రెడీ!
-
Ragi Egg Dosa: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఈ దోశ తింటే చాలు!
-
Modi – Meloni – Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
-
Allu Arjun: ‘ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్’.. అంటూ బావ కోసం బన్నీ స్పెషల్ విషెస్ ..
ట్రెండింగ్
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!