Venkata Ramana Reddy: సభకు మాత్రమే కొత్త.. రాజకీయాలకు కాదు
- రాజకీయాలకు కొత్త కాదు కానీ.. సభకు మాత్రమే కొత్త- వెంకటరమణా రెడ్డి
- సభకు కొత్తగా 50మంది ఎమ్మెల్యేలను వచ్చాం..
- కొత్త సభ్యులు సీనియర్ సభ్యుల నుంచి నేర్చుకునేలా సభ ఉండాలి..
- సభ తీరు చూస్తుంటే విమర్శలు.. ప్రతి విమర్శలకే సరిపోతుంది- వెంకటరమణా రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. రాజకీయాలకు కొత్త కాదు కానీ.. సభకు మాత్రమే కొత్తని అన్నారు. సభకు కొత్తగా 50మంది ఎమ్మెల్యేలం వచ్చాం.. కొత్త సభ్యులు సీనియర్ సభ్యుల నుంచి నేర్చుకునేలా సభ ఉండాలని తెలిపారు. సభ తీరు చూస్తుంటే విమర్శలు, ప్రతి విమర్శలకే సరిపోతుందని ఆయన ఆరోపించారు. రైతులకు కావాల్సిన కరెంట్ సామాగ్రి అందడం లేదని ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి పేర్కొన్నారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు తప్పితే ఎలక్ట్రిక్ డిపోలు ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు. రైతులు ట్రాన్స్ఫార్మర్స్ కోరితే ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ప్రభుత్వ స్థలమా, ప్రైవేట్ స్థలమా.. అక్కడ ఇళ్లు నిర్మిస్తారా అనేది పరిశీలించకుండానే విద్యుత్ తీగలను వేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇళ్ల మీద నుంచి ఉన్న విద్యుత్ లైన్లను మార్చాలని ఆయన చెప్పారు.
Read Also: Sangharsana: ఆగస్టు రేసులో మరో చిన్న సినిమా
Also Read
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
- Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
- Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దాలని ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి తెలిపారు. 23 వందల మంది మీటర్ రీడింగ్ చేస్తున్నారు.. మీటర్ రీడింగ్ చేస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. స్మార్ట్ మీటర్లను పెట్టిన ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇవ్వవచ్చు.. గత ప్రభుత్వం విద్యుత్ రంగంలో అవినీతి చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తే.. పారదర్శకంగా వ్యవహరించామని బీఆర్ఎస్ చెబుతోందన్నారు. హౌస్ కమిటీ వేసి విద్యుత్ అక్రమాలపైన విచారణ జరిపించాలని.. సభలో హుందాగా ఆదర్శవంతంగా వ్యవహరించాలని కోరారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి.. వ్యక్తిగత దూషణలు మంచిది కాదని పేర్కొన్నారు.
Read Also: Rahul Gandhi: దేశం చక్రవ్యూహంలో చిక్కుకుపోయింది.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్పై కోహ్లీ ఫైర్..
-
UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
-
RJ Balaji: థియేటర్లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన RJ బాలాజీ.. వీడియో వైరల్
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..