Varanasi: ప్రధాని పర్యటనకు ముందు.. జవాన్, బీజేపీ ఎమ్మెల్యే మధ్య కుమ్ములాట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిని సందర్శించారు. ప్రధాని పర్యటనకు ముందు బీజేపీ ఎమ్మెల్యే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి.. ప్రధానమంత్రి మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా వారణాసిలో ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా శనివారం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.
READ MORE: Montha Effect : ఎల్లుండి ఏపీకి కేంద్ర బృందం.. ఈ జిల్లాల్లో పర్యటన
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
అయితే.. దానికి ముందు, వారణాసి కాంట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సౌరభ్ శ్రీవాస్తవ రైల్వే స్టేషన్కు చేరుకుని సన్నాహాలను పరిశీలించారు. అక్కడ ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) జవాన్తో ఆయన వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరూ ఒకరినొకరు తోసుకుంటూ కనిపించారు. ఎమ్మెల్యే శ్రీవాస్తవ పార్టీ కార్యకర్తలను రైల్వే స్టేషన్ లోపలికి తీసుకెళ్లడానికి ప్రయత్నించినందున ఈ ఘర్షణ జరిగిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్పీఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య కుమ్ములాట జరిగినట్లు చెబుతున్నారు.
READ MORE: DSP Richa Ghosh: టీమిండియాలో మరో డిఎస్పీ.. నియామకపత్రం అందజేత..
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సౌరభ్ శ్రీవాస్తవ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పిఎఫ్) అధికారికి మధ్య జరిగిన ఘర్షణకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమాజ్వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశారు. “ప్రభుత్వ అధికారి విధులను అడ్డుకున్నందుకు, ఇంత గందరగోళాన్ని సృష్టించినందుకు బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలి. ఇది ప్రధానమంత్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో బీజేపీ దుండగులకు ఉదాహరణ. ప్రధాని నియోజకవర్గంలోనే ఇలా ఉంది. ఇతర ప్రదేశాల విషయానికొస్తే, ఇంకా ఏమి చెప్పాలి? ఇది ఖండించదగినది – శిక్షార్హమైనది!” అని అఖిలేష్ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!