NTV Telugu Site icon

Raghunandan Rao: 171 ఓట్లతో గెలిచిన కేటీఆర్.. 1700 ఓట్లతో గెలిచిన నన్ను ఎక్కిరిస్తుండు

Raghunandan Rao

Raghunandan Rao

2009 ఎన్నికల్లో 171 ఓట్లతో గెలిచిన కేటీఆర్.. 1700 ఓట్లతో గెలిచని నన్ను ఎక్కిరిస్తుండని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు విమర్శించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్, మంత్రి హరీష్ రావులపై ధ్వజమెత్తారు. తండ్రి, కొడుకు, అల్లుడు వరుస పట్టి దుబ్బాక వస్తున్నారు.. ఏం చేశారు? అని ప్రశ్నించారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లతో పోల్చి దుబ్బాకుకు ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం ఇస్తారా? కేసీఆర్ అంటేనే అబద్ధం, కేసీఆర్ అంటేనే మోసమన్నారు.

Also Read: Bhatti Vikramarka: నోటిఫికేషన్ వస్తే.. రైతు బంధు ఇవ్వడం కుదరదని కేసీఆర్ కు తెలుసు

మీరు చెప్పిన అబద్ధాలు చెప్పాలంటే 5సం.లు పడుతదని మండిపడ్డారు. అయ్య, కొడుకు, అల్లుడికి నామీద కోపం ఎందుకు..? దుబ్బాక అభివృద్ధికి నిధులు కావాలనుకోవడం తప్పా..? అని పేర్కొన్నారు. మీరు చేసిన అరాచకాలకు మీ మీద విరక్తి రావడంతో దుబ్బాక ప్రజలు నన్ను ఎన్నికున్నారు.. అందుకే రఘునందన్ రావు ఎమ్మెల్యే అయ్యాడన్నారు. కత్తి పోట్లు మేము కూడా చేయవచ్చు అనడం ఒక్క ముఖ్యమంత్రికే కేసీఆర్‌కే చెల్లిందని, మీరు ఎక్కడికి రమ్మంటే వస్తే.. నన్ను పొడవండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Revanth Reddy: హరీష్ రావు వ్యాఖ్యల వల్లే రైతు బంధు ఆగింది..