BJP Leaders House Arrest : ఎక్కడికక్కడ బీజేపీ నేతల హౌస్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛలో బాట సింగారం నేపథ్యంలో జిల్లాలో ఎక్కడికక్కడ బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇక, బీజేపీ ఆఫీసు ముందు రెండు ప్లాటూన్స్తో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు ఈటల రాజేందర్ నివాసాలకు పోలీసులు భారీగా చేరుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఛలో బాట సింగారం కార్యక్రమానికి భారీ ఎత్తున తరలి వెళ్ళాలని బీజేపీ ప్లాన్ చేసింది. అయితే.. 6 లక్షల 10 వేల ఇళ్ల నిర్మాణాలు చేపడతామని తెలంగాణ సర్కార్ కేంద్రానికి నివేదిక ఇచ్చిందని బీజేపీ చెబుతోంది.
Also Read : Prabhas First look: ప్రభాస్ ఫస్ట్ లుక్ మీద ట్రోల్స్.. మార్చి మళ్ళీ రిలీజ్ చేసిన మేకర్స్
Also Read
- Air India: ప్రధాని మోదీ పొదుపు మంత్రం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..
- Supreme Court: హిందూ మతం ఓ జీవన విధానం.. దీపం వెలిగిస్తే సరిపోతుందన్న సుప్రీంకోర్టు
- Kerala CM Row: కేరళలో ముదిరిన కాంగ్రెస్ పోరు.. రాహుల్, ప్రియాంక గాంధీలకు వార్నింగ్..
- Modi Cabinets: రైతులకు శుభవార్త.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
అలాగే కేంద్ర ప్రభుత్వం 17 వేల కోట్ల రూపాయలను వివిధ రూపాల్లో 2 లక్షల 83 వేల డబల్ బెడ్ రూం ఇళ్ల కోసం మంజూరు చేసిందంటోంది. అయితే ప్రభుత్వం ఇళ్లను ఎందుకు చేపట్టలేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర నిధుల నుండి ఒక్కో బెడ్ రూంకి 6 లక్షలు ఖర్చు చేసిన 2 లక్షల 83 వేల ఇళ్లు పూర్తి అయ్యేవని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే.. కేంద్రం ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోయాయని, ఇందులో భాగంగానే సోషల్ ఆడిట్ ఇన్స్పెక్షన్ పేరుతో నేడు పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించేందుకు రెడీ అయ్యారు.
Also Read : Gunasekhar: అన్యాయం జరిగితే మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఎంతవరకైనా వెళ్తా.. గుణశేఖర్ వార్నింగ్?
జన్ సున్వాయి పేరుతో బాట సింగారం వెళ్లేందుకు ప్రణాళికలు రచించారు. దీంతో.. బీజేపీ నేతల అక్రమ అరెస్ట్లను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఖండించారు. ఈ క్రమంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హౌస్ అరెస్ట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూడటానికి వెళ్తుంటే బీఆర్ఎస్కు ఉలికిపాటెందుకు?. ఇదేమైనా ఉద్యమమా? లేక తిరుగబాటా?. కేవలం ఇళ్లు చూడటానికి వెళ్తుంటే భయమెందుకు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Air India: ప్రధాని మోదీ పొదుపు మంత్రం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..
-
Supreme Court: హిందూ మతం ఓ జీవన విధానం.. దీపం వెలిగిస్తే సరిపోతుందన్న సుప్రీంకోర్టు
-
Kerala CM Row: కేరళలో ముదిరిన కాంగ్రెస్ పోరు.. రాహుల్, ప్రియాంక గాంధీలకు వార్నింగ్..
-
Modi Cabinets: రైతులకు శుభవార్త.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!