BJP Kisan Morcha : వ్యవసాయ శాఖ కమిషనర్కి బీజేపీ కిసాన్ మోర్చా వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినమైన డిసెంబర్ 9 రైతులకు కానుకగా 2 లక్షల లోపు వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తానని నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9 ముగిసి కొత్త సంవత్సరం వచ్చిన ఈ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనబడటం లేదని, అదే విధంగా రైతుబంధు పైసలు కూడా రైతుల అకౌంట్లో నేటికీ జమ కాలేదని వెంటనే రైతుల ఖాతాల్లో రైతుబంధు పైసలు జమ చేయాలని శ్రీధర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రభుత్వం గత పది సంవత్సరాల లో వ్యవసాయ యాంత్రిక పరికరాలకు సబ్సిడీ ఇవ్వకుండా రైతులను ఇబ్బందుల పాలు చేసిందని ప్రధానమంత్రి పంటల బీమా యోజన కూడా తెలంగాణలో అమలు చేయలేదన్నారు.
ఈ నేపథ్యంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సహచర కిసాన్ మోర్చా నేతలతో కలిసి వ్యవసాయ కమిషనరేట్లో కమిషనర్ గోపి కు మెమోరాండం సమర్పించారు. కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల ఆకాంక్షలను అమలు చేయాలని వ్యవసాయ కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి బీజేపీ కిసాన్ మోర్చా బృందం వినతి పత్రం సమర్పించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి, పాపయ్య గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కార్యదర్శులు నరసింహారెడ్డి, నిరంజన్, అలేందర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
-
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!