Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు టెన్షన్లో బీజేపీ..
- మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు టెన్షన్ లో బీజేపీ..
- సీట్ల పంపకాలపై మహాయుతి కూటమిలో అంతర్గత పోరు..
- తమకు 100 సీట్లు కేటాయించాలని శివసేన ( షిండే) డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి (బీజేపీ, శివసేన ( షిండే వర్గం), ఎన్సీపీ ( అజిత్ ))లో సీట్ల పంచాయితీ కొనసాగుతుంది. అయితే, ఈ ఏడాది అక్టోబర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 100 స్థానాల్లో పోటీ చేసే అవకాశం తమ పార్టీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీకి టెన్సన్ పట్టుకుంది.
Read Also: Mudragada Padmanabha Reddy: పేరు మారింది.. ఇక, ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డి
Also Read
- T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
అయితే, శివసేన (షిండే) 58వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్ నాథ్ షిండే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుధవారం రాష్ట్ర మాజీ మంత్రి రాందాస్ కదమ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు 100 సీట్లు కావాలి, వాటిలో 90 సీట్లు గెలుస్తాం అని డిమాండ్ చేశారు. అలాగే, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ పార్టీకి కూడా 80- 90 సీట్లు ఇవ్వాలంటూ మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత ఛగన్ భుజ్బల్ ఇటీవల వ్యాఖ్యానించారు.
Read Also: Air Pollution: వాయు కాలుష్యం ఎఫెక్ట్.. రోజూ 2 వేల మంది చిన్నారుల బలి!
వీరి ఇరివురి వ్యాఖ్యలపై స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. బీజేపీ అతిపెద్ద పార్టీ, రాష్ట్ర ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. దీనిపై మూడు పార్టీల నేతలు సమావేశమై చర్చించిన తర్వాతే సీట్ల పంపకాల ఫార్ములా ఖరారు కానుంది అని చెప్పుకొచ్చారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 48 స్థానాలకు గాను 17 స్థానాలను అధికార మహాయుతి కైవసం చేసుకుంది. బీజేపీ 9, శివసేన 7, ఎన్సీపీ 1 సీట్లలో విజయం సాధించాయి.
తాజావార్తలు
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!