Navneet Kaur: అమరావతిలో నామినేషన్ వేసిన నవనీత్ కౌర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ నటి, బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ అమరావతిలో నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అఫిడవిట్ సమర్పించేటప్పుడు ప్రమాణపత్రాన్ని చదివారు. 2019లో మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి నవనీత్ కౌర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అనంతరం ఆమె బీజేపీకి దగ్గరయ్యారు. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో మళ్లీ అమరావతి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నవనీత్ కౌర్ పేరును ప్రకటించింది. దీంతో ఆమె గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఇక బీజేపీ అభ్యర్థిగా ప్రకటన వెలువడగానే మహారాష్ట్ర బీజేపీ నేత, డిప్యూటీ సీఎం ఫడ్నవిస్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నవనీత్ కౌర్ దంపతులు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇది కూడా చదవండి: CPM manifesto: “సీఏఏ, ఉగ్రవాద వ్యతిరేక చట్టాల రద్దు, ఆర్టికల్ 370 పునరుద్ధరణ”.. సీపీఎం మేనిఫెస్టో విడుదల..
Also Read
- Rainbow Hospital: 5వ అంతస్తు నుంచి జారి పడిన బాలుడు.. పునర్జన్మ నిచ్చిన రెయిన్బో హాస్పిటల్ వైద్యులు..
- Sabang Port: మోదీ వ్యూహంతో చైనాకు చెక్.. సబాంగ్ పోర్టు భారత్కు ఎందుకు కీలకం?
- Babar Azam: పాపం పాకిస్థాన్కు కెప్టెన్ దొరకట్లే.. మళ్లీ బాబర్ ఆజమ్ చేతికే పాక్ టీ20 పగ్గాలు!
- Trump–Meloni: టర్కీలో ట్రంప్-మెలోనీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇదిలా ఉంటే గురువారం నవనీత్ కౌర్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కుల ధృవీకరణ పత్రం విషయంలో అనుకూల తీర్పు వెలువరించింది. దీంతో ఆమెకు ఎన్నికల ముందు బిగ్ రిలీఫ్ లభించింది. నవనీత్ రాణా 2019లో ఎస్సీ కేటగిరిలో అమరావతి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచింది. కాకపోతే ఈ విషయంలో నవనీత్ రానా అందించిన ఎస్సీ సర్టిఫికెట్లు సరైనవి కాదని కొందరు బాంబే హైకోర్టులో కేసు వేశారు. విచారణలో భాగంగా కోర్టు ఆమెకు రెండు లక్షల జరిమానా విధించింది. అయితే హైకోర్టు ఆదేశాలు ఆమెకు అనుకూలంగా రాకపోవడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గురువారం ఆమెకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Hema Malini: హేమమాలినిపై కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ నోటీసులు
నవనీత్ కౌర్ ఎస్సీ కాదంటూ ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. 2021, జూన్ 8న ‘మోచి’ కుల ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించి మోసపూరితంగా పొందిందని హైకోర్టు అప్పట్లో పేర్కొంది. దీనితో ఎంపీ నవనీత్ రాణాకి రూ. 2 లక్షల జరిమానా కూడా విధించింది. నవనీత్ రాణా ‘సిక్కు-చామర్’ కులానికి చెందినదని రికార్డులు సూచించాయి. అయితే తాజా తీర్పుతో అవేవి నిజం కాదని తేలిపోయింది. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల ముందు నవనీత్కౌర్కు భారీ ఉపశమనం లభించింది.
ఇది కూడా చదవండి: Viral Video: తల్లి ప్రేమంటే ఇదే భయ్యా.. రోడ్డు పక్కన కూర్చున్న అమ్మ ఏం చేస్తుందో చూడండి..
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. అటు తర్వాత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న చివరి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి.
#WATCH | BJP candidate Navneet Rana files nomination from Amravati Lok Sabha seat in Maharashtra
(Source: DIO Amravati) pic.twitter.com/HSk4svphP4
— ANI (@ANI) April 4, 2024
తాజావార్తలు
-
Rainbow Hospital: 5వ అంతస్తు నుంచి జారి పడిన బాలుడు.. పునర్జన్మ నిచ్చిన రెయిన్బో హాస్పిటల్ వైద్యులు..
-
Sabang Port: మోదీ వ్యూహంతో చైనాకు చెక్.. సబాంగ్ పోర్టు భారత్కు ఎందుకు కీలకం?
-
Babar Azam: పాపం పాకిస్థాన్కు కెప్టెన్ దొరకట్లే.. మళ్లీ బాబర్ ఆజమ్ చేతికే పాక్ టీ20 పగ్గాలు!
-
Trump–Meloni: టర్కీలో ట్రంప్-మెలోనీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
-
Abhijeet Dipke: ఓ వైపు ఆమరణ నిరాహార దీక్ష.. మరోవైపు నూడుల్స్, పకోడీలు తింటున్న CJP వ్యవస్థాపకుడు!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..