Bilawal Bhutto: సింధూ నదిలో భారతీయుల రక్తం పారుతుంది.. భారత్పై భుట్టో పిచ్చికూతలు..
- భారత్పై విరుచుకుపడ్డ బిలావల్ భుట్టో జర్దారీ
- సింధూ నాగరికతకు సంరక్షకులం తామని పిచ్చికూతలు
- సింధూ నదిలో భారతీయుల రక్తం పారుతుందని వ్యాఖ్య
- బహిరంగ సభలో నోరు జారిన బిలావల్ భుట్టో జర్దారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింధు జలాల ఒప్పందం నిలిపివేయడం పాకిస్థాన్ను ఆగ్రహానికి గురిచేసిందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ అన్నాడు. నీటిని ఆపడానికి ప్రయత్నిస్తే భారతదేశం దాని పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని భుట్టో పేర్కొన్నాడు. సింధు నాగరికతకు పాకిస్థాన్ నిజమైన సంరక్షకులం తామే అని.. సింధూ నదిలో నీరు పారకపోతే.. భారతీయుల రక్తం పారుతుందని రెచ్చగెట్టే వ్యాఖ్యలు చేశాడు. “సింధు నది మనదే అవుతుంది. మన నీరు దాని గుండా ప్రవహిస్తుంది. లేదా వారి(భారత్) రక్తం ప్రవహిస్తుంది” అని భుట్టో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో నోరు జారాడు.
READ MORE: Komitreddy Venkat Reddy : కాళేశ్వరం నాణ్యత లోపానికి కారణమైన వాళ్లపై చర్యలు తప్పవు
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
పాకిస్థాన్, భారతదేశం మధ్య ఒక ఒప్పందం ఉందని బిలావల్ భుట్టో అన్నాడు. ఈ ఒప్పందంలో సింధు నది పాకిస్థాన్కు చెందుతుందని భారతదేశం పేర్కొందని వెల్లడించాడు. ఈ ఒప్పందాన్ని తాము అంగీకరించబోమని నేడు మోడీ అంటున్నారని.. దీన్ని ఎవరూ అంగీకరించరన్నారు. పాకిస్థాన్ ప్రజలు అంగీకరించరని.. భారత ప్రజలు కూడా మనపై జరుగుతున్న ఈ దారుణాన్ని సహించరని జోష్యం చెప్పాడు.
READ MORE: Komitreddy Venkat Reddy : కాళేశ్వరం నాణ్యత లోపానికి కారణమైన వాళ్లపై చర్యలు తప్పవు
ఉగ్రవాద దాడికి భారతదేశం పాకిస్థాన్ను నిందించిందని భుట్టో అన్నాడు. కశ్మీర్లో ఉగ్రవాద దాడి జరిగిందని.. తామంతా దాన్ని ఖండించామన్నాడు. పాకిస్థాన్ ఉగ్రవాదంతో బాధపడుతోందని తాము కూడా చెప్పామని.. కానీ భారతదేశం దానికి మమ్మల్ని నిందించడం సరికాదని పేర్కొన్నాడు. మీ జనాభా ఎక్కువ, మీది పెద్ద దేశమైతే, మీరు మీ ఇష్టానుసారం ఏ నిర్ణయమైనా తీసుకుంటారా? అని పిచ్చికూతలు కూశాడు. పాకిస్థాన్ ప్రజలు గర్వంగా, ధైర్యవంతులుగా ఉంటారని.. వారి హక్కులను ఎలా కాపాడుకోవాలో వారికి తెలుసని ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!