Pakistan: పాక్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లీయర్.. భుట్టో షరతులకు నవాజ్ అంగీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ లో సంకీర్ణ ప్రభుత్వానికి లైన్ క్లీయర్ అయింది. పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ పవర్ షేరింగ్ ఫార్ములాకు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, నాలుగుసార్లు ప్రధానిగా పని చేసిన నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో జర్దారీల మధ్య జరిగిన ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read Also: Ranchi Test: ఇంగ్లండ్తో నాలుగో టెస్టు.. టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం!
Also Read
- SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
ఇక, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 266 మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ఏ పార్టీకి అయినా 133 స్థానాల్లో విజయం సాధించాలి.. కానీ, పాకిస్థాన్ లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి అక్కడి ప్రజలు మెజార్టీ ఇవ్వలేదు.. దీంతో ప్రస్తుతం మూడు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇక, బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. మూడేళ్లు ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఉంటారు.. ఆ తర్వాత రెండేళ్లు ప్రధాని పదవిని తాను చేపడుతాను అని చెప్పారు. అయితే, ప్రజల సమస్యలపై మాట్లాడే ప్రధాని దేశానికి అవసరం.. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలందరూ తమ సొంత ప్రయోజనాలను వదిలి దేశ ప్రజల గురించి ముందుగా ఆలోచించాలి అని బిలావల్ భుట్టో పిలుపునిచ్చారు.
Read Also: TSRTC: 4 రోజులు బస్సు ప్రయాణాలు వాయిదా వేసుకోండి.. ఆర్టీసీ అధికారుల సూచన
అయితే, పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అధికార భాగస్వామ్య సమీకరణాలను వెల్లడించారు. ప్రధానమంత్రి పదవిని తమ పార్టీ, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ పంచుకుంటాయని చెప్పారు. అయితే, ఫిబ్రవరి 8వ తేదీన పాకిస్థాన్లో జరిగిన ఎన్నికల్లో జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులు 265 స్థానాలకు గాను 93 స్థానాల్లో విజయం సాధించారు. కాగా, పీఎంఎల్-ఎన్ 75 సీట్లు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 54 సీట్లు గెలుచుకోగలిగింది. ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్తాన్ (MQM-P) కూడా 17 సీట్లలో విజయం సాధించి నవాజ్ షరీఫ్- బిలావల్ భుట్టోల సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి అంగీకరించింది.
తాజావార్తలు
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!