Parking Bikes Theft: పార్కింగ్ లో బైక్ పెడితే అంతే సంగతులు.. ఘరానా దొంగ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ చుట్టుపక్కల బైక్ ల దొంగతనాలు ఎక్కువైపోయాయి. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి తొమ్మిది లక్షల రూపాయల విలువ చేసే పదహారు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు.
Read Also: Bhatti Vikramarka: నేనూ పాదయాత్ర చేస్తా.. త్వరలోనే షెడ్యూల్ చెబుతా
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
మియాపూర్ మెట్రో రైల్ స్టేషన్ వద్ద వాహనాల తనిఖీ చేపడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తారసపడ్డాడని డీసీపీ పేర్కొన్నారు. అతనిని విచారించగా ద్విచక్ర వాహనాలను దొంగలించే నిందితుడిగా గుర్తించి…అతని వద్ద ఉన్న 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని శిల్పవల్లి వివరించారు. నిందితుడు జగిత్యాల జిల్లాకు చెందిన రంగు గంగాధర్ హైదరాబాద్ నగరానికి జీవనోపాధి కోసం వచ్చాడని ఆమె తెలిపారు.

దురలవాట్లు, జల్సాలకు అలవాటుపడి డబ్బు కోసం ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. నిందితుడు గంగాధర్ మియాపూర్ 5, సనత్నగర్ 3, మాదాపూర్ 1, కూకట్పల్లి రెండు, కేపీహెచ్జీ ఒకటి, ఉప్పల్, ఎల్బీనగర్ నాలుగు ద్విచక్ర వాహనాలను అపహారించి ఓఎల్ఎక్స్ ద్వారా విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు డీసీపీ శిల్పవల్లి మియాపూర్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీతోపాటు మాదాపూర్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ నంద్యాల నరసింహారెడ్డి ,ఏసిపి నరసింహారావు మియాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు మియాపూర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కాంతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Also:Farm house: రాజధాని శివారులోని ఫామ్ హౌస్ లపై ఎస్వోటీ దాడులు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!