Araria Journalist : జర్నలిస్ట్ దారుణ హత్య.. విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Araria Journalist: బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అరారియా జిల్లాలో స్థానిక జర్నలిస్టును గుర్తు తెలియని దుండగులు ఈ రోజు ఉదయం అతని ఇంటి వద్ద కాల్చి చంపినట్లు బీహార్ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన రాణిగంజ్ బజార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దీనిని విచారకరమైన సంఘటనగా అభివర్ణించారు. వార్త విన్న వెంటనే నేరంపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. పాట్నాలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఓ జర్నలిస్టును ఇలా ఎలా హత్య చేస్తారని ఆయన అన్నారు.
విమల్ కుమార్ యాదవ్ అనే 35 ఏళ్ల బాధితుడు దైనిక్ జాగరణ్ వార్తాపత్రికలో స్థానిక జర్నలిస్టుగా పనిచేశాడని పోలీసులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు రాణిగంజ్లోని ప్రేమ్నగర్లోని ఆయన ఇంట్లోకి ప్రవేశించారు. నలుగురు వ్యక్తులతో వచ్చిన నేరస్థులు రాణిగంజ్లోని విమల్ యాదవ్ ఇంటికి చేరుకుని, అతన్ని బయటకు పిలిచి అతని ఛాతీలో బుల్లెట్లు కాల్చారు. అరారియా జిల్లా ఎస్పీ కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపామని, ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలంలో ఉందని పోలీసులు తెలిపారు. అతని పొరుగువారితో పాత శత్రుత్వమే ఘటనకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
Also Read
Also Read: New Royal Enfield Bullet 350: సెప్టెంబర్లో లాంఛ్ కానున్న కొత్త రాయల్ ఎన్ ఫీల్డ్ 350
రెండేళ్ల క్రితం సర్పంచ్గా ఉన్న బాధితుడి సోదరుడు కూడా ఇలాగే హత్యకు గురయ్యాడు. ఈ కేసులో విమల్కుమార్ యాదవ్ ప్రధాన సాక్షిగా ఉన్నందున అతని హత్యకు దీనికి సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆరోపించిన బెదిరింపులు ఉన్నప్పటికీ, కొనసాగుతున్న కోర్టు విచారణలో విమల్ యాదవ్ తన సోదరుడి హంతకుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. “రాణిగంజ్ బజార్ ప్రాంతంలో విమల్ కుమార్ యాదవ్ అనే జర్నలిస్టును గుర్తుతెలియని నేరస్థులు కాల్చి చంపారు. మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోంది. హత్యా స్థలానికి డాగ్ స్క్వాడ్ రప్పించబడింది. దర్యాప్తు కొనసాగుతోంది.” అరారియా ఎస్పీ అశోక్ కుమార్ సింగ్ అన్నారు. జర్నలిస్ట్ హత్య నేపథ్యంలో ప్రతిపక్షం ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఈ ఘటన బీహార్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చూపిస్తోందని ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు. బీహార్లో జర్నలిస్టులతో సహా అమాయక పౌరులు, పోలీసు సిబ్బంది కూడా హత్యకు గురవుతుండగా నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి ఆరోపించారు.
అరారియాలో జర్నలిస్టు విమల్ యాదవ్ హత్యపై సీఎం నితీశ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. హత్య కేసును దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని అధికారులకు అవసరమైన సూచనలు చేశామని ఆయన చెప్పారు. ఓ జర్నలిస్టును ఎందుకు, ఎలా హత్య చేశారంటూ సీఎం నితీశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీడియాతో సీఎం నితీశ్ మాట్లాడుతూ.. ఇది చాలా బాధాకరం. సమాచారం అందిన వెంటనే ఓ జర్నలిస్టు ఎలా హత్యకు గురయ్యాడనే విషయంపై పూర్తి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించి సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
-
TVS iQube MillionR Edition: 145KM రేంజ్తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్తో MillionR Edition!
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
-
Boltt Ace 5G, Evo: బోల్ట్ ఏస్ 5G, ఇవో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, 64MP AI కెమెరా, 8GB ర్యామ్.. ధర, ఫీచర్లు ఇవే
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!