PM Modi: బీహార్ ముఖ్యమంత్రి, నితీష్ కుమార్, ఇతర జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) నాయకులకు ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అధికార కూటమి విజయం సాధించినందుకు ఆయన అభినందించారు. ఈ “అద్భుతమైన ప్రజల తీర్పు”తో బీహార్ ప్రజలకు సేవ చేసే శక్తి ఎన్డీఏకు లభిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఎన్డీఏ బీహార్లో అన్ని రకాల అభివృద్ధిని అందించడం వల్లే ఈ అఖండ విజయం సాధ్యమైందని ప్రధాని వరుస ‘ఎక్స్’ పోస్టుల్లో తెలిపారు. ఈ విజయాన్ని “సుపరిపాలన విజయం, అభివృద్ధి విజయం, ప్రజా సంక్షేమ స్ఫూర్తి విజయం, సామాజిక న్యాయం విజయం”గా ఆయన అభివర్ణించారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏను చారిత్రక, అపూర్వ విజయంతో ఆశీర్వదించిన బీహార్ ప్రజలకు ఆయన తన ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు.
మహాఘటబంధన్ (Mahagathbandhan) అబద్ధాలను బహిర్గతం చేయడానికి అలుపెరుగకుండా కృషి చేసిన ఎన్డీఏ కార్యకర్తలకు కూడా ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ బీహార్ అభివృద్ధి కోసం ఈ కూటమి నిరంతరం కృషి చేస్తుందని, తద్వారా ప్రతి యువతకు, మహిళకు శ్రేయస్సుతో కూడిన జీవితానికి విస్తృత అవకాశాలు లభిస్తాయని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో బీహార్ అభివృద్ధికి, అక్కడి మౌలిక సదుపాయాలకు, రాష్ట్ర సంస్కృతికి కొత్త గుర్తింపు తీసుకురావడానికి చురుకుగా పనిచేస్తామని ప్రధాని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో పాటు కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్ మాంఝీ, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహాకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Bihar Election Results: బిహార్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ !
భారతీయ జనతా పార్టీ (BJP), జనతా దళ్ (యునైటెడ్) (JDU) తో పాటు, ఎన్డీఏ కూటమిలో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ (LJP-RM), కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్), రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) ఉన్నాయి. మొత్తం 122 స్థానాలు మెజారిటీ మార్కుగా ఉన్న బీహార్లో.. ఈ కూటమి 200కు పైగా స్థానాలతో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. భారతీయ జనతా పార్టీ (BJP) అతిపెద్ద పార్టీగా అవతరించేందుకు రంగం సిద్ధమైంది. బీహార్లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ సంవత్సరం బీహార్లో 1951 నుండి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 66.91 శాతం ఓటింగ్ నమోదైంది.
Good governance has won.
Development has won.
Pro-people spirit has won.
Social justice has won.
Gratitude to each and every person of Bihar for blessing the NDA with a historical and unparalleled victory in the 2025 Vidhan Sabha elections. This mandate gives us renewed…
— Narendra Modi (@narendramodi) November 14, 2025