PM Modi: బీహార్లో ఎన్డీఏ ఘన విజయం.. సీఎం నితీష్ కుమార్కు ప్రధాని అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బీహార్ ముఖ్యమంత్రి, నితీష్ కుమార్, ఇతర జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) నాయకులకు ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అధికార కూటమి విజయం సాధించినందుకు ఆయన అభినందించారు. ఈ “అద్భుతమైన ప్రజల తీర్పు”తో బీహార్ ప్రజలకు సేవ చేసే శక్తి ఎన్డీఏకు లభిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఎన్డీఏ బీహార్లో అన్ని రకాల అభివృద్ధిని అందించడం వల్లే ఈ అఖండ విజయం సాధ్యమైందని ప్రధాని వరుస ‘ఎక్స్’ పోస్టుల్లో తెలిపారు. ఈ విజయాన్ని “సుపరిపాలన విజయం, అభివృద్ధి విజయం, ప్రజా సంక్షేమ స్ఫూర్తి విజయం, సామాజిక న్యాయం విజయం”గా ఆయన అభివర్ణించారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏను చారిత్రక, అపూర్వ విజయంతో ఆశీర్వదించిన బీహార్ ప్రజలకు ఆయన తన ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read
- Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ 'గట్ ఫీల్' గురించే అంటూ వ్యాఖ్యలు..
- WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
- IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్గా యువరాజ్ సింగ్..
- Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
మహాఘటబంధన్ (Mahagathbandhan) అబద్ధాలను బహిర్గతం చేయడానికి అలుపెరుగకుండా కృషి చేసిన ఎన్డీఏ కార్యకర్తలకు కూడా ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ బీహార్ అభివృద్ధి కోసం ఈ కూటమి నిరంతరం కృషి చేస్తుందని, తద్వారా ప్రతి యువతకు, మహిళకు శ్రేయస్సుతో కూడిన జీవితానికి విస్తృత అవకాశాలు లభిస్తాయని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో బీహార్ అభివృద్ధికి, అక్కడి మౌలిక సదుపాయాలకు, రాష్ట్ర సంస్కృతికి కొత్త గుర్తింపు తీసుకురావడానికి చురుకుగా పనిచేస్తామని ప్రధాని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో పాటు కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్ మాంఝీ, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహాకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Bihar Election Results: బిహార్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ !
భారతీయ జనతా పార్టీ (BJP), జనతా దళ్ (యునైటెడ్) (JDU) తో పాటు, ఎన్డీఏ కూటమిలో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ (LJP-RM), కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్), రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) ఉన్నాయి. మొత్తం 122 స్థానాలు మెజారిటీ మార్కుగా ఉన్న బీహార్లో.. ఈ కూటమి 200కు పైగా స్థానాలతో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. భారతీయ జనతా పార్టీ (BJP) అతిపెద్ద పార్టీగా అవతరించేందుకు రంగం సిద్ధమైంది. బీహార్లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ సంవత్సరం బీహార్లో 1951 నుండి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 66.91 శాతం ఓటింగ్ నమోదైంది.
Good governance has won.
Development has won.
Pro-people spirit has won.
Social justice has won.
Gratitude to each and every person of Bihar for blessing the NDA with a historical and unparalleled victory in the 2025 Vidhan Sabha elections. This mandate gives us renewed…
— Narendra Modi (@narendramodi) November 14, 2025
తాజావార్తలు
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
-
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
-
KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
-
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?