INDIA Bloc: కూటమిలో మరో చీలిక.. అభ్యర్థుల్ని ప్రకటించేసిన ఆర్జేడీ
ఇండియా కూటమిలో మరో చీలిక వచ్చేటట్టు కనిపిస్తోంది. బీహార్లో కాంగ్రెస్ పార్టీతో ఆర్జేడీ సీట్ల లెక్క ఇంకా తేలలేదు. కానీ సంకీర్ణ ధర్మాన్ని మాత్రం రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ విస్మరించింది. ఏకపక్షంగా 13 చోట్ల ఆర్జేడీ అభ్యర్థులను ఖరారు చేసింది. బీహార్ తొలి విడతలో ఉన్న 4 నాలుగు స్థానాలు ఇందులో ఉన్నాయి. ఆర్జేడీ ఏకపక్షంగా వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం రుచించడం లేదు.
సివాన్, కతిహార్, మధుబని నియోజకవర్గాలకు ఆర్జేడీ అభ్యర్థులను వెల్లడించింది. ఈ మూడు సీట్లను సీపీఎం ఎంఎల్ కూడా ఆశిస్తోంది. కతిహార్ స్థానం కోసం కాంగ్రెస్, సీపీఎం ఎంఎల్ మధ్య గట్టి పోటీ నెలకొంది. మధుబని సీటు కోసం ఆర్డేజీ, సీపీఐ, సీపీఎం పోటీ పడుతున్నాయి. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం చర్చలు జరుపుతుండగా ఆర్జేడీ అధినేత 13 మంది అభ్యర్థులను ప్రకటించారు. ముస్లిం, యాదవ్, కుష్వాహా ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను ప్రకటించారు.
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ
- Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!
- Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
- New LPG Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!
ఆర్జేడీ అభ్యర్థులు వీరే..
బంకా- జై ప్రకాశ్ యాదవ్, సరన్- రోహిణి ఆచార్య, ఉజియార్పూర్- అలోక్ మెహతా, పట్లిపుత్ర-మీసా భారతి, బక్సర్- సుధాకర్ సింగ్, జెహనాబాద్- సురేంద్ర యాదవ్, ముంగర్- అనిత్ మహతో, మధుబని- అష్రఫ్ అలి ఫాత్మీ, వైశాలి- రామా సింగ్తో 13 నియోజకవర్గాలకు ఆర్జేడీ అభ్యర్థులను ప్రకటించింది.
మరోవైపు సీపీఎం ఎంఎల్, సీపీఐ, సీపీఎం కూడా మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాయి. అరాకు సుదామ ప్రసాద్, అవదేష్- రాయ్ బెగుసరాయ్, ఖగారియాకు సంజయ్ కుష్వాహాను ప్రకటించాయి.
ఇదిలా ఉంటే ఇటీవలే ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్నామని.. కాంగ్రెస్కు సీట్లు ఇస్తామని చెప్పుకొచ్చారు. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే.. ఇంకో వైపు అభ్యర్థులను ప్రకటించేసింది. దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
బీహార్లో మొత్తం 40 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో కూడా ఇటీవల సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. బీజేపీకి 17, జేడీయూకి 16, మిగతా స్థానాలు మిత్రపక్షాలకు కేటాయించారు. ఈసారి బీజేపీనే ఒక సీటు ఎక్కువ తీసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ
-
Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!
-
Kyle Jamieson IPL Penalty: బిగ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..
-
Axar Patel: ఎందుకు అతడిని లెజెండ్ అంటారో ఇప్పుడు అర్థమైంది.. ఆ ఆనందమే వేరప్ప!
-
Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!