Himalayan Glacier: వేగంగా కరిగిపోతున్న హిమాలయాలు.. 16 దేశాలకు ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో అధిక ఉష్ణోగ్రతలతో వేడి గాలులతో జనం అల్లాడిపోతున్నారు. వాతావరణంలో అనూహ్య మార్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతూ చనిపోతున్నారు. ఈ తరుణంలో హిమాలయ ప్రాంతంలోని హిమనీ నదాలు వేగంగా కరిగిపోతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీని కారణంగా తక్కువలో తక్కువగా రెండు బిలియన్ల మంది జీవితాలకు, వారి జీవనోపాధికి పెను ముప్పు పొంచి ఉంది అపి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ రిపోర్ట్ లో తెలింది.
Read Also: Rashmika Mandana : ఆ పీరియాడిక్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక…?
Also Read
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాలకు నిలయమైన ఆసియా హిందూ కుష్ హిమానీనదాలు 2011 నుంచి 2020 మధ్య కాలంలో 65 శాతం మేర వేగంగా కరిగిపోతునట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఇది ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం చివరి నాటికి.. వాటి ప్రస్తుత పరిమాణంలో 80 శాతం మేర కోల్పోవచ్చని నేపాల్కు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ తాజా రిపోర్ట్ లో తెలిపింది. దీని ఫలితంగా కాలక్రమేణా ఈ ప్రాంతంలోని 16 దేశాలలో ప్రవహించే 12 నదులలో మంచినీటి సరఫరా భారీగా తగ్గిపోవచ్చని కూడా పేర్కొనింది.
Read Also: Indian 2: కమల్ కే షాక్ ఇచ్చిన ఎయిర్పోర్ట్ సిబ్బంది… షూటింగ్ నే ఆపేసారు
పశ్చిమాన అఫ్గనిస్థాన్ నుంచి తూర్పు మాయన్మార్ వరకూ 3,500 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న ఈ పర్వత శ్రేణుల్లో మరింతగా మంచు క్షీణిస్తుండటంతో భారీగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ఐసీఐఎంఓడీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అధ్యయనంలో చైనా, భారత్ సహా ఆసియా ఖండంలోని 8 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
Read Also: Harish Rao: 171 మంది అర్చకులకు దూప దీప నైవేద్యం పథక పత్రాలు.. అందించిన హరీశ్రావు
ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదంతో పాటు హిందూ కుష్ హిమాలయాల అంతటా ఉన్న 200 హిమనీనదాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. హిమానీనద సరస్సు విస్పోటం వల్ల వరదల ముప్పు ఎక్కువగా ఉంది అని నివేదిక పేర్కొంది. వ్యవసాయం, ఆహార భద్రత, మంచినీటి లభ్యత, ఇంధన వనరులపై ప్రభావం చూపే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. జీవవైవిధ్య హాట్స్పాట్లలోని కొన్ని జంతు వృక్ష జాతులు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉందని ఐసీఐఎంఓడీ హెచ్చరికలు జారీ చేసింది.
తాజావార్తలు
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!