ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. 6వ మ్యాచ్ బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ మధ్య జరిగింది. రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని 23 బంతులు ఉండగానే గెలిచింది. 46.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో రచిన్ రవీంద్ర (112)సెంచరీతో చెలరేగాడు. 105 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాధించాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్లో టామ్ లాథమ్ (55), డెవిన్ కాన్వే (30), గ్లేన్ ఫిలిప్స్ (21*), మిచెల్ బ్రేస్ వెల్ (11*) పరుగులతో పర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ బౌలింగ్లో టస్కిన్ అహ్మద్, నహీద్ రానా, ముస్తఫిజుర్ రహమన్, రిషాద్ హుస్సేన్ తలో వికెట్ తీశారు.
Read Also: Bandi Sanjay : మీరు విచారణ చేస్తూ… మమ్ముల్ని అరెస్ట్ చేయమంటారా?
అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటింగ్లో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (77) ఒంటరి పోరాటం చేశాడు. ఆ తర్వాత జాకీర్ అలీ (45) పర్వాలేదనిపించాడు. రిషాద్ హుస్సేన్ (26), తంజీద్ హసన్ (24), మెహిదీ హసన్ మిరాజ్ (13) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలింగ్లో మిచెల్ బ్రేస్ వెల్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత విల్ ఓ’రూర్కే రెండు వికెట్లు తీశాడు. హెన్రీ, జేమీసన్ తలో వికెట్ సంపాదించారు. కాగా.. ఈ న్యూజిలాండ్ విజయంతో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచింది. బంగ్లాదేశ్ వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయింది. దీంతో.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. భారత్, న్యూజిలాండ్ సెమీస్కు వెళ్లాయి.
Read Also: Minister Narayana: 2027లో ఏపీలో గోదావరి పుష్కరాలు.. కుంభమేళా ఏర్పాట్లపై ఆరా తీసిన మంత్రి బృందం