Bhumana Karunakar Reddy: దేవాలయాలకు భద్రత లేదు.. సనాతన ధర్మానికి రక్షణ లేదు!
- కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు భద్రత లేదు
- సీఎం పాలనలో కాశినాయన క్షేత్రం నేలకొరిగింది
- కాశినాయన క్షేత్రంపై దాడిని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
24 గంటల పాటు అన్నదానం సాగె దివ్యక్షేత్రం కాశినాయన క్షేత్రం అని, అన్నదానం సత్రాన్ని కూటమి ప్రభుత్వం బుల్డోజర్తో కూలగొట్టిందని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా బుల్డోజర్తో కాశినాయన క్షేత్రంను కూల్చారన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామనే సీఎం చంద్రబాబు పాలనలో కాశినాయన క్షేత్రం నేలకొరిగిందన్నారు. నిరసన, తీవ్ర వ్యతిరేకత రావడంతో మంత్రి నారా లోకేష్ తానే కట్టిస్తా అన్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు భద్రత లేదు, సనాతన ధర్మానికి రక్షణ లేదు అని భూమన ఫైర్ అయ్యారు.
’24 గంటల పాటు అన్నదానం సాగె దివ్యక్షేత్రం కాశినాయన క్షేత్రం. అన్నదానం సత్రాన్ని కూటమి ప్రభుత్వం బుల్డోజర్తో కూలగొట్టింది. కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా బుల్డోజర్తో కాశినాయన క్షేత్రంను కూల్చారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామనే సీఎం చంద్రబాబు పాలనలో కాశినాయన క్షేత్రం నేలకొరిగింది. నిరసన, తీవ్ర వ్యతిరేకత రావడంతో దీనిపై నారా లోకేష్ స్పందించి నేనే కట్టిస్తా అన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ పీఠాధిపతి పవనానంద తీర్థ స్వామీజీ దీనికి సమాధానం ఏం చేబుతారు?. టైగర్ జోన్లో ఉందని దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం విడ్డూరం, టైగర్ జోన్లో ఉన్న శ్రీశైల మల్లన్న దేవాలయాన్ని కూల్చివేస్తారా?. ఈ కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు భద్రత లేదు, సనాతన ధర్మానికి రక్షణ లేదు’ అని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
‘వైసీపీ హయాంలో నెయ్యిలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు నిర్భయంగా ప్రకటన చేశారు. కేవలం వైసీపీ పైన బలమైన ఆరోపణలు చేయాలని ప్రజలపై రుద్దారు. శ్రీవారి ఆలయం వద్ద తాగబోతూ హల్చల్ చేయడం హిందూ ఆలయాలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి తెలుస్తోంది. తిరుమలలో మూడు సార్లు ఎర్ర చందనం పట్టుకున్నారు. కాశినాయన క్షేత్రంపై దాడిని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఎన్టీఆర్ శవాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నిలబడింది లోకేష్. ఎన్టీఆర్ ను మానసికంగా వేధించి టీడీపీని లాక్కున్నాడు చంద్రబాబు. కూటమి ప్రభుత్వంలో ఉండటం వల్లే బీజేపీ నోరు మెదపడం లేదు?’ అని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!