Bhumana Karunakar Reddy : నిషేధిత భూములకు విముక్తి …దసరా ముందే వచ్చిందక్కడ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో దసరా వేడుక ముందే వచ్చింది. నిషేధిత భూములకు జగన్ ప్రభుత్వం విముక్తి కల్పించింది. దీంతో ఐదు వేల కుటుంబాల ఆస్తులకు రిజిస్ట్రేషన్ సౌకర్యం వెసలుబాటు కలిగింది. ఇదంతా తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చొరవే కారణం.
తిరుపతి నగరం దినదినాభివృద్ధి చెందుతోంది. తిరుపతిలో వాటర్ కోర్స్ పోరంబోకు స్థలాలుగా పరిగణిస్తూ నగరపాలక సంస్థ పరిధిలోని తంబువాని గుంట, కొర్లగుంట, కొత్తపల్లి, చంద్రశేఖర్ రెడ్డి కాలనీ, ఎరుకల కాలనీ, జర్నలిస్ట్ కాలనీ ( ఎర్రమిట్ట), కసం గడ్డ- కెనడి నగర్, భగత్ సింగ్ కాలనీ ( ఓబులేసు కాలనీ), సుందరయ్య నగర్, శారదా నగర్, సూరయ్య కట్ట, చెన్నారెడ్డి కాలనీ, సంజీవయ్య నగర్, సింగాల గుంట, నరసింహ తీర్థం రోడ్డు, తాతయ్య గుంట, బొమ్మగుంట ప్రాంతాల్లోని స్థలాలను నిషేధిత జాబితా 22(ఎ) లో చేర్చారు.
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
దీంతో తిరుపతి అర్బన్ పరిధిలోని 17 ప్రాంతాల్లోని 104 ఎకరాల పరిధిలో. 5 వేల నివాసాలకు పైగా తీవ్ర ప్రభావం పడింది. ఇవేవీ 60 ఏళ్లకు పైగా రిజిస్ట్రేషన్ సౌకర్యానికి నోచుకోలేదు. దీంతో కళ్ల ముందే ఆస్తులున్నా అవసరానికి వాడుకోలేని దయనీయ స్థితి. తమ స్థలాలను రెగ్యులరైజ్ చేయించాలని కొన్నేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ 17 ప్రాంతాల్లోని ప్రజలు కాళ్లరిగేలా తిరుతున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
గత సార్వత్రిక ఎన్నికల సందర్భంలో తిరుపతిలో వైసీపీ తరపున బరిలో నిలిచిన భూమన కరుణాకరరెడ్డి నీటి ఆవాసానికి ఏ మాత్రం అవకాశం లేని జనాలతో నిండిన ప్రాంతాలకు విముక్తి కల్పిస్తానని హామీ ఇచ్చారు. తిరుపతిలో లోకల్ బాడీ కొలువుతీరిన వెంటనే భూమన అభినయ్ ఈ భూముల అంశాన్ని లేవనెత్తి, సమస్య పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తీర్మానించారు. పిమ్మట భూమన కరుణాకర రెడ్డి అనేక దఫాలుగా కలెక్టర్, తదితర రెవెన్యూ అధికారులతో చర్చించారు. ఈ విషయమై సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. గత శనివారం ఈ భూములకు విముక్తి కల్పించే విషయమై తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డితో భూమన , డిప్యూటీ మేయర్ అభినయ్ చర్చించారు. భూమన శ్రమ ఎట్టకేలకు సత్ఫలితాలను ఇచ్చింది. దాని ఫలితంగానే నేడు 104 ఎకరాల భూమి రెగ్యులరైజ్కు నోచుకుంది.
17 ప్రాంతాల్లోని ఐదు వేలకు మించి కుటుంబాల ఆస్తులకు నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో 104 ఎకరాలకు రిజిస్ట్రేషన్కు అడ్డంకులు తొలిగాయి. ఈ నిర్ణయం రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రభావం పడే అవకాశం వుంది. తిరుపతిలో వైసీపీ విజయానికి దోహదం చేస్తుందనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే తిరుపతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించడం అధికార పార్టీకి సానుకూలం కానుందనే చర్చకు తెరలేచింది. నిషేధిత భూములకు విముక్తి పొందిన లబ్ధిదారులు దసరాను ముందే చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..