TTD Chairman: టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఛైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డిని సీఎం జగన్ నియమించారు. ఈమేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వైవీ సుబ్బారెడ్డి స్థానంలో భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. గతంలో టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి పని చేశారు.2006-2008 మధ్య టీటీడీ చైర్మన్గా భూమన పనిచేశారు. టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తనను టీటీడీ ఛైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కరుణాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు.
Read Also: Ruchitha Sadineni: క్యూట్ లుక్స్ తో రుచిత సాధినేని ఫోజులు
Also Read
- CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
అయితే, ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో రాజకీయ వ్యవహారాలు చూడనున్నారని సమాచారం. వైవీ సుబ్బారెడ్డిది ఈ నెల పదో తేదీతో రెండు సార్లు అంటే నాలుగేళ్ల పదవి కాలం పూర్తవుతుంది. ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి 2019లో ఆ బాధ్యతలు చేపట్టారు. ఇక ప్రస్తుతం చైర్మన్తో పాటు టీటీడీలో 35 మంది పాలక సభ్యులు ఉన్నారు. ఇప్పుడున్న చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ఇంకో వారం రోజుల్లో ముగియనుంది.
Read Also: TTD Chairman: టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి..
అయితే, వాస్తవానికి రెండేళ్ల క్రితమే టీటీడీకి కొత్త చైర్మన్ ని నియమించాల్సి ఉంది. కానీ, వైవీ సుబ్బారెడ్డికి రెండోసారి పదవిని ఏపీ ప్రభుత్వం కొనసాగించింది. టీటీడీ ఛైర్మన్ రేసులో ఈసారి కూడా చాలా పేర్లు పరిశీలనకు వచ్చాయి. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. ఆ పోస్ట్ కాపులకు ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపించింది. కానీ సీఎం జగన్ మాత్రం కరుణాకర్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న కరుణాకర్ రెడ్డి, టీటీడీ చైర్మన్ గా త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారు. రాబోయే బ్రహ్మోత్సవాలు కూడా ఆయన హయాంలోనే జరిగే అవకాశాలున్నాయి.
- Tags
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!