భారత్బెంజ్ కమర్షియల్ సెగ్మెంట్ కోసం ఒక కొత్త బస్సును విడుదల చేసింది. కంపెనీ ఈ బస్సుకు అనేక హైటెక్ ఫీచర్లు, పవర్ ఫుల్ ఇంజిన్ను అందించారు. భారత్బెంజ్ ఈ బస్సులో 380-లీటర్ ఫ్యుయల్ ట్యాంక్తో అమర్చారు. ఇది 1,300 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బస్సు 295/80 R22.5 టైర్లు, డ్రైవర్, కో-డ్రైవర్తో సహా 51 మంది ప్రయాణీకులను తీసుకెళ్లగలిగే కెపాసిటీని కలిగి ఉంది. BB1924 బస్సు 19.5 టన్నుల మోసే కెపాసిటీని కలిగి ఉంది.
Also Read:Telangana Rising Global Summit Day1: తొలి రోజే రూ. 2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడులు..
కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఈ బస్సులో ఎంట్రీ రోల్ బార్, ముందు, వెనుక న్యూమాటిక్ సస్పెన్షన్, ABS, EBD, ఐదు-దశల ఎలక్ట్రో-మాగ్నెటిక్ బ్రేక్లు, ESC, క్రూయిజ్ కంట్రోల్, బ్రేక్ హోల్డ్ అసిస్ట్, TFT డిస్ప్లే వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. BB1924 బస్సు భారత్బెంజ్ నుండి వచ్చిన OM 926 టర్బోచార్జ్డ్, ఇంటర్కూల్డ్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 241 హార్స్పవర్, 850 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బస్సు ఆరు-స్పీడ్ ట్రాన్స్మిషన్తో లింక్ చేశారు.
ప్రతి BB1924 6 సంవత్సరాల/6 లక్షల కి.మీ పవర్ట్రెయిన్ వారంటీ, అదే వ్యవధి గల ఆప్షనల్ AMC ప్యాకేజీలతో వస్తుంది. కంపెనీ 95% విడిభాగాల లభ్యతను 24–48 గంటల్లోపు ప్రకటిస్తుంది. దీనికి 92% స్థానిక, దేశవ్యాప్త సప్లై చైన్ మద్దతు ఇస్తుంది. మొదటి తప్పనిసరి సర్వీస్ 60,000 కి.మీ.కి వస్తుంది. ఆ తర్వాత ప్రతి 1,20,000 కి.మీ.కి తనిఖీలు చేస్తారు. కంపెనీ ప్రకారం, ఛాసిస్ 10–15 సంవత్సరాల సర్వీస్ లైఫ్ కి రూపొందించారు.