Bharat Rice: సామాన్యులకు శుభవార్త! రూ.29కే భారత్ రైస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా నిత్యవసర ధరలు ఆకాశాన్నంటాయి. బియ్యం దగ్గర నుంచీ కూరగాయలు.. గ్యాస్.. పెట్రోల్ ఇలా ప్రతిదీ కొనలేని పరిస్థితి. సామాన్యుల దగ్గర నుంచి మధ్య తరగతి కుటుంబాల వారు ఈ ధరలతో అల్లాడిపోతున్నారు. ఇప్పుడు బియ్యం ధరలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు మార్కెట్లో కిలో రైస్ రూ.40-50 ఉంటే.. ఇప్పుడు ఏకంగా రూ.70-80 వరకు అమ్ముతున్నారు. ఈ ధరలతో పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం భారత్ రైస్ను (Bharat Rice) మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావాలని భావించింది.
గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్తో పేదలకు ఒరిగిందేమీలేదని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. పైగా సార్వత్రిక ఎన్నికల ముందు తాయిలాలు ఉంటాయని అందరూ భావించారు. కానీ నిరలమ్మ మాత్రం ఉసురు మనిపించారు. ఇంకోవైపు బియ్యం ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో భారత్ రైస్ కార్యక్రమంతో రూ.29లకే కిలో బియ్యాన్ని రిటైల్ మార్కె్ట్ ద్వారా అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచే భారత్ రైస్ను కిలో రూ.29లకు అందించబోతున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా వెల్లడించారు.
Also Read
- Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
- Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. 'మునగాకు పొడి'.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
- KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
- CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
ఈ భారత్ రైస్ను నేషనల్ అగ్రికల్చర్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాల్లో ఈ బియ్యాన్ని విక్రయించనున్నట్లు వెల్లడించారు. 5 కేజీలు, 10 కేజీల బ్యాగుల్లో ‘భారత్ రైస్’ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇప్పటికే భారత్ గోధుమపిండి కిలో రూ.27.50, శనగ పప్పు రూ.60 చొప్పున విక్రయిస్తున్నారు. భారత్ రైస్ విధానంతో సామాన్యులకు ఊరట కల్గుతుందని సంజీవ్ చోప్రా అభిప్రాయపడ్డారు.
- Tags
తాజావార్తలు
-
Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
-
CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
-
Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్చేస్తే..
ట్రెండింగ్
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?