Basavaraj Bommai: భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ‘రీలాంచ్’ కోసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basavaraj Bommai: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ కోసమే తప్ప, ఇది సామాన్య ప్రజలను ఉద్దేశించినది కాదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం అన్నారు. భారతదేశంలో పార్టీ అస్తిత్వం కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడుతున్నారని తెలిపారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఉన్న భారత్ జోడో యాత్ర (మంగళవారం 34వ రోజుకు చేరుకుంది)కు రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారు. రాయచూర్ తాలూకాలోని గిలేసుగూర్ గ్రామంలో సీఎం బొమ్మై, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ సంకల్ప యాత్రను ప్రారంభించిన అనంతరం బొమ్మై మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్యతో తలపడి తాను పార్టీలో చేరిన రోజే ‘సమాజ్వాద్’ను వీడినట్లు చెప్పారు. ‘సమాజ్వాదీ నేపథ్యం నుంచి వచ్చిన సిద్ధరామయ్య కాంగ్రెస్లో చేరిన రోజున ‘సమాజ్వాద్’ను వదిలిపెట్టారు. సిద్ధరామయ్య ఓ చిన్న పిల్లవాడి కింద పనిచేస్తూ ఆయన సూచనలను పాటించడం బాధాకరం. ఇది ఆత్మగౌరవానికి చిహ్నం కాదు.’ అని బొమ్మై అన్నారు.
“కాంగ్రెస్ నేతలు అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగానే రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని, ఈ ఘటన రాహుల్ గాంధీ ‘రీలాంచ్’ తప్ప మరొకటి కాదని బసవరాజ్ బొమ్మై అన్నారు. సామాన్యులు, దళితుల కోసం కాదంటూ విమర్శించారు. కాంగ్రెస్ను ‘మునిగిపోతున్న ఓడ’గా అభివర్ణించిన బొమ్మై, ఆ వైపు (కాంగ్రెస్) ఉన్నవారు ఇటువైపు (బీజేపీ) వస్తున్నారని, అందుకు సంబంధించిన సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దళితులు, వెనుకబడిన తరగతుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ఎప్పుడూ ఆలోచించలేదని ఆరోపించిన ముఖ్యమంత్రి.. ఆ పార్టీకి వారిని ఉద్ధరించాలనే ఇంగితజ్ఞానం లేదన్నారు.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలకు 15 నుంచి 17 శాతానికి, షెడ్యూల్డ్ తెగలకు 3 శాతం నుంచి 7 శాతానికి రిజర్వేషన్లు పెంచేందుకు కర్ణాటక కేబినెట్ శనివారం ఏకగ్రీవంగా అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. విద్య, ఉపాధిపై అవగాహన వల్ల ప్రజల ఆకాంక్ష పెరిగిందని ముఖ్యమంత్రి అన్నారు
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!