Basavaraj Bommai: భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ‘రీలాంచ్’ కోసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basavaraj Bommai: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ కోసమే తప్ప, ఇది సామాన్య ప్రజలను ఉద్దేశించినది కాదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం అన్నారు. భారతదేశంలో పార్టీ అస్తిత్వం కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడుతున్నారని తెలిపారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఉన్న భారత్ జోడో యాత్ర (మంగళవారం 34వ రోజుకు చేరుకుంది)కు రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారు. రాయచూర్ తాలూకాలోని గిలేసుగూర్ గ్రామంలో సీఎం బొమ్మై, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ సంకల్ప యాత్రను ప్రారంభించిన అనంతరం బొమ్మై మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్యతో తలపడి తాను పార్టీలో చేరిన రోజే ‘సమాజ్వాద్’ను వీడినట్లు చెప్పారు. ‘సమాజ్వాదీ నేపథ్యం నుంచి వచ్చిన సిద్ధరామయ్య కాంగ్రెస్లో చేరిన రోజున ‘సమాజ్వాద్’ను వదిలిపెట్టారు. సిద్ధరామయ్య ఓ చిన్న పిల్లవాడి కింద పనిచేస్తూ ఆయన సూచనలను పాటించడం బాధాకరం. ఇది ఆత్మగౌరవానికి చిహ్నం కాదు.’ అని బొమ్మై అన్నారు.
“కాంగ్రెస్ నేతలు అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగానే రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని, ఈ ఘటన రాహుల్ గాంధీ ‘రీలాంచ్’ తప్ప మరొకటి కాదని బసవరాజ్ బొమ్మై అన్నారు. సామాన్యులు, దళితుల కోసం కాదంటూ విమర్శించారు. కాంగ్రెస్ను ‘మునిగిపోతున్న ఓడ’గా అభివర్ణించిన బొమ్మై, ఆ వైపు (కాంగ్రెస్) ఉన్నవారు ఇటువైపు (బీజేపీ) వస్తున్నారని, అందుకు సంబంధించిన సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దళితులు, వెనుకబడిన తరగతుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ఎప్పుడూ ఆలోచించలేదని ఆరోపించిన ముఖ్యమంత్రి.. ఆ పార్టీకి వారిని ఉద్ధరించాలనే ఇంగితజ్ఞానం లేదన్నారు.
Also Read
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలకు 15 నుంచి 17 శాతానికి, షెడ్యూల్డ్ తెగలకు 3 శాతం నుంచి 7 శాతానికి రిజర్వేషన్లు పెంచేందుకు కర్ణాటక కేబినెట్ శనివారం ఏకగ్రీవంగా అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. విద్య, ఉపాధిపై అవగాహన వల్ల ప్రజల ఆకాంక్ష పెరిగిందని ముఖ్యమంత్రి అన్నారు
తాజావార్తలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!