Matsya 6000: సముద్రయాన్..మరో ఘనత సాధించడానికి సిద్ధమవుతున్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రయాన్ 3 తో జాబిల్లి రహస్యాలను తెలుసుకోనున్న భారత్ అంతరిక్షం గుట్టు మాత్రేమే కాదు లోతైన సముద్రం రహస్యలను కూడా తెలుసుకునేందుకు సిద్దమవుతుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా మాత్రమే కలిగి ఉన్న మానవసహిత జలాంతర్గాములును భారత్ కూడా అభివృద్ధి చేయనుంది. సముద్రయాన్ మిషన్ పేరుతో సముద్రం అడుగున 6 వేల మీటర్ల లోతుకు జలాంతర్గామిని పంపనున్నారు. ఈ ప్రాజెక్ట్ లో కీలకం జలాంతర్గామి మత్స్య-6000. ప్రస్తుతం దీని పనులు చివరి దశలో ఉన్నాయి. దీనిని చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేస్తోంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది దేశంలోనే మొట్టమొదటి మానవసహిత సముద్ర అన్వేషణ మిషన్. ఈ సబ్ మెర్సిబుల్ ఫొటోలు, వీడియోలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది సముద్రగర్భ అన్వేషణకు తోడ్పడే మానవసహిత జలాంతర్గామి అని ఆయన తెలిపారు.
Also Read
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
ఈ జలాంతర్గామిలో ముగ్గురు కూర్చొని 6 కిలోమీటర్ల సముద్రపు లోతుకు చేరుకోవచ్చు.ఇది మొదటగా 500 మీటర్ల మేర నీటి అడుగులకు ప్రయాణం చేయనుంది. తరువాత ఆక్వానాట్ లు సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు వెళ్లేందుకు వీలుగా గోళాకార సబ్ మెరైన్ ను నిర్మిస్తున్నారు. ఈ మిషన్ ద్వారా సముద్ర గర్భ రహస్యాలను చేధించే అవకాశం ఉంది. సముద్ర వనరులు, జీవవైవిధ్యం మీద అధ్యయనం చేయడమే కాకుండా కోబాల్డ్, నికెల్, మాంగనీస్ వంటి విలువైన లోహాలు, ఖనిజాల గురించి అన్వేషించడానికి ఈ మిషన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆ సబ్ మెర్సిబుల్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కిరణ్ రిజిజు దానిలో కూర్చొన్నారు. దాని గురించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీని ద్వారా సముద్ర వనరుల వివరాలు తెలుసుకొని ఆర్థికవృద్ధి సాధించాలని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా దీని ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇక దీని ద్వారా చెన్నై తీరంలోని బంగాళఖాతంలోకి 2024 లేదా 2025లో ముగ్గురు ఆక్వానాట్స్ను పంపించనున్నారు.
Next is “Samudrayaan”
This is ‘MATSYA 6000’ submersible under construction at National Institute of Ocean Technology at Chennai. India’s first manned Deep Ocean Mission ‘Samudrayaan’ plans to send 3 humans in 6-km ocean depth in a submersible, to study the deep sea resources and… pic.twitter.com/aHuR56esi7— Kiren Rijiju (@KirenRijiju) September 11, 2023
తాజావార్తలు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!