Bihar : పాతిపెట్టిన బాలిక మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకొచ్చిన తండ్రి.. ఆక్సీజన్ పెట్టాలంటూ ఆందోళన
- బీహార్ రాష్ట్రంతో వింత ఘటన
- చనిపోయిన బిడ్డను ఆస్పత్రికి తీసుకొచ్చిన తండ్రి
- బిడ్డను బతికిస్తానని ఆస్పత్రిలో పూజలు చేపట్టిన మంత్రగత్తె
Bihar : బీహార్లోని భాగల్పూర్లోని నవ్గాచియాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. భూతవైద్యం సమయంలో మట్టిలో పాతిపెట్టిన చనిపోయిన బాలిక మృతదేహాన్ని బయటకు తీసిన తర్వాత, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. అమ్మాయి బతికే ఉంది.. ఆక్సిజన్ పెట్టండి అంటూ డాక్టర్ను కోరారు. అంతేకాదు ఒక మంత్రగత్తె ఆసుపత్రిలో భూతవైద్యం చేయడం మొదలు పెట్టింది. బాలికను తిరిగి ప్రాణాలతో తీసుకువస్తానని చెప్పింది. దీనిపై వైద్యులు నిరసన వ్యక్తం చేయడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రి బయట ఆందోళనకు దిగారు. బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 24 గంటల క్రితమే మరణించింది.
Read Also:Etala Rajender: బీజేపీలో కలకలం.. రాజాసింగ్ కు ఈటెల ఘాటు రిప్లై..
Also Read
నోనియా పట్టి నివాసి అయిన భగవాన్ మహతో 10 నెలల కుమార్తె హర్షిత కుమారి గత రెండు రోజులుగా నవ్గాచియాలోని ఓ ప్రైవేట్ క్లినిక్లో చికిత్స పొందుతోంది. అక్కడ తన ఆరోగ్యం క్షీణించడంతో, ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. భాగల్పూర్లోని తిల్కామాంఝీ చౌక్లో వెళ్లారు. ఇక్కడ వైద్యులు బాలిక చనిపోయినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు బాలిక మృతదేహాన్ని నవ్గాచియాకు తీసుకువచ్చి సాయంత్రం 4 గంటలకు పాతిపెట్టారు.
Read Also:Koppula Eshwar: ఎవరికోసం సింగరేణిని వేలం వేస్తున్నారో కేంద్రం చెప్పాలి..?
భూతవైద్యురాలు సోనీ దేవి నా శరీరంపై భగవతి వస్తుంది. మీ బిడ్డ బతికే ఉంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లండి. నేను బిడ్డను తిరిగి తీసుకువస్తాను. దీంతో కుటుంబ సభ్యులు అతడి వలలో పడి మట్టిలో పాతిపెట్టిన బాలికను బయటకు తీసి వందలాది మంది గ్రామస్తులతో కలిసి సబ్ డివిజన్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత, ఆమె బిడ్డ బతికే ఉందని, ఆమెకు ఆక్సిజన్ ఇవ్వాలని వైద్యులకు చెప్పడంతో భూతవైద్యురాలు సోనీ దేవి ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోనే పువ్వులు, నీటితో బిడ్డకు భూతవైద్యం చేయడం ప్రారంభించింది. బాలిక చనిపోయిందని వైద్యులు కుటుంబీకులకు చెప్పడంతో మృతురాలి కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆస్పత్రిలో ఆందోళన నిర్వహించారు. దీని తర్వాత, ఆసుపత్రి మేనేజర్ నవ్గాచియా పోలీస్ స్టేషన్కు కాల్ చేశారు. దీంతో పోలీసులు రావడంతో విషయం సద్దుమణిగి భూతవైద్యం చేసిన మహిళ సోనీదేవిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
తాజావార్తలు
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!