Koppula Eshwar: ఎవరికోసం సింగరేణిని వేలం వేస్తున్నారో కేంద్రం చెప్పాలి..?
- కాంగ్రెస్- బీజేపీ సింగరేణిని ప్రయివేటు చేసేందుకు చర్యలు చేపట్టారు..
- సింగరేణిని ప్రయివేటు కి ఇవ్వాలని ఎందుకు ప్రయత్నాలు..
- ఎవరికోసం సింగరేణిని వేలం వేస్తున్నారో కేంద్రం చెప్పాలి...
Koppula Eshwar:ఎవరికోసం సింగరేణిని వేలం వేస్తున్నారో చెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు సింగరేణిని ప్రయివేటు పరం చేసేందుకు వేగంగా చర్యలు చేపట్టారని తెలిపారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి మంత్రి పదవి రావడంతో సింగరేణిని కాపాడతారని భావించామని తెలిపారు. సింగరేణి ఒక సంస్థ మాత్రమే కాదు ఈ ప్రాంతం కొంగు బంగారం లక్షలాది మందికి ఉపాధినిస్తున్న సంస్థ అన్నారు. కేంద్రం, రాష్ట్రం భాగస్వామ్యంతో సింగరేణి నడుస్తున్నప్పటికి కేసీఆర్ వచ్చాక ఆయన చొరవతో లాభాల్లోకి వచ్చిందని తెలిపారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగసంస్థ అయిన సింగరేణిని ప్రయివేటు కి ఇవ్వాలని ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒరిస్సాలో, తమిళనాడు, గుజరాత్ లో ఉన్న బొగ్గుగనులను ఆయా రాష్ట్రాలకు ఇచ్చారన్నారు.
Read also: Raviteja : ఓవర్ చేయకు రోయ్.. నీ దిష్టే తగిలేలా వుంది..
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
తెలంగాణాలో ఉన్న సింగరేణిని ఎందుకు ప్రయివేట్ వారికి ఇస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం సింగరేణిని తెలంగాణకు ఇవ్వాలని కోరినా ఎందుకు కేంద్రం ఇవ్వలేదని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ కూడా సింగరేణి కోల్ బ్లాక్ ల వేలాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాశారన్నారు. సీఎం గా ఉన్న రేవంత్ ఇప్పుడు మోడీ తో కలిసి సింగరేణిని వేలం కుట్ర తెరతీశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేలాన్ని వ్యతిరేకించకుండా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వేలంలో పాల్గొనడం ధ్వంద్వ వైఖరికి నిదర్శనం అన్నారు. ఎన్నికలకు ముందు సింగరేణిని ప్రయివేటు పరం చేయము అని మోడీ చెప్పి అధికారంలోకి రాగానే మాట మార్చారన్నారు. బొగ్గు నిల్వలను కనుగొనేందుకు సింగరేణి ఇప్పటికే వందల కోట్లు ఖర్చు చేసింది.. అటువంటి సంస్థను ప్రయివేటు వారికి ఇవ్వడం దారుణమన్నారు. ప్రైవేట్ సంస్థలు వస్తే రిజర్వేషన్లు పోతాయి.. పేదలు, దళితులు హక్కులను కోల్పోయి నష్టపోతారన్నారు.
Pension Amount : పెన్షన్ పంపిణీపై అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష..
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!