Bihar Birdge Collapse : బీహార్లో కుప్పకూలిన మరో వంతెన.. అసలు సిమెంటే వాడడం లేదా ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Birdge Collapse : బీహార్లో వంతెనలు కూలడం ఇటీవల కాలంలో సర్వ సాధారణంగా మారింది. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా చోట్ల పాత వంతెనలు కూలిపోతున్న వార్తలు వినే ఉంటాం. ఈసారి మూడోసారి ఖగారియాలోని అగువానీ-సుల్తంగంజ్ మధ్య గంగా నదిపై నిర్మిస్తున్న నాలుగు లైన్ల వంతెన పిల్లర్ స్లాబ్ నిర్మాణం గంగా నదిలో పడి కూలిపోయింది. సుల్తాన్గంజ్ నుండి అగువానీ ఘాట్ వైపు 9, 10 నంబర్ల మధ్య భాగం గంగా నదిలో మునిగిపోయింది. ఈ వంతెనను ఎస్పీ సింగ్లా కంపెనీ నిర్మిస్తోంది. భాగల్పూర్ జిల్లాలోని సుల్తాన్గంజ్లో నిర్మిస్తున్న ఈ వంతెన ఖగారియా, భాగల్పూర్ జిల్లాలను కలుపుతూ నిర్మించబడింది.
Read Also:Fauji: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పూజతో మొదలైన ప్రభాస్ సినిమా.. లుక్ ఇదే..
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
అంతకుముందు కూడా, జూన్ 4, 2023న, సుల్తాన్గంజ్-అగువానీ గంగా నదిపై నిర్మిస్తున్న నాలుగు లేన్ల వంతెన నేలమట్టం అయింది. నిర్మాణంలో ఉన్న వంతెన సూపర్ స్ట్రక్చర్ నదిలో పడిపోయింది. ప్రమాదం తర్వాత వంతెనపై విధులు నిర్వహిస్తున్న ఇద్దరు గార్డులు కూడా కనిపించకుండా పోయారు. ఆ సమయంలో అగువానీ వైపు నుండి వంతెన పీర్ నంబర్లు 10,11,12 పైన ఉన్న మొత్తం సూపర్ స్ట్రక్చర్ కూలిపోయింది, ఇది దాదాపు 200 మీటర్ల భాగం ఉంటుంది.
Read Also:Rajanna Sircilla: మరో యువతితో భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఎమ్మెల్యే అనుచరుడు
27 ఏప్రిల్ 2022న నిర్మాణంలో ఉన్న ఈ వంతెన సూపర్ స్ట్రక్చర్ మరో సారి నదిలో పడిపోయింది. బలమైన తుఫాను, వర్షం కారణంగా సుమారు 100 అడుగుల పొడవు పడిపోయింది. అయితే ఆ సమయంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఆ తర్వాత మళ్లీ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈసారి దాదాపు 80 శాతం సూపర్ స్ట్రక్చర్ పనులు పూర్తయ్యాయి. అంతే కాదు అప్రోచ్ రోడ్డు పనులు కూడా 45 శాతం పూర్తయ్యాయి. ఈ వంతెన ఉత్తర, దక్షిణ బీహార్లను కలుపుతూ బీహార్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్గా పరిగణించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక విలువ రూ.1710.77 కోట్లు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 23 ఫిబ్రవరి 2014న శంకుస్థాపన చేశారు. ఈ వంతెన, రహదారి నిర్మాణంతో NH 31 – NH 80 అనుసంధానించబడతాయి. ఈ వంతెన పొడవు 3.160 కిలోమీటర్లు కాగా, అప్రోచ్ మార్గం మొత్తం పొడవు 25 కిలోమీటర్లు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!