Viral Video : రైలులో మట్టి నింపిన నకిలీ పవర్ బ్యాంక్ల విక్రయం..వీడియో వైరల్
- రైలులో వస్తువులు కొనే ముందు జాగ్రత్తలు తప్పనిసరి
- ప్రయాణికులను మోసం చేయడానికి వెనుకాడని విక్రయదారులు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పవర్ బ్యాంకు విక్రయదారుడి వీడియో
- మట్టితో నిండిన పవర్ బ్యాంకుల విక్రయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైలులో ప్రజలు అన్ని రకాల వస్తువులను విక్రయిస్తూ ఉంటారు. కొందరు తినుబండారాలు, నీళ్లు, ఇయర్ఫోన్లతో సహా మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా అమ్ముతుంటారు. కానీ ఈ విక్రయదారులు చాలా మంది ప్రయాణికులను మోసం చేయడానికి వెనుకాడరు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి ప్రయాణికులకు పవర్ బ్యాంక్లను విక్రయిస్తున్నట్లు కనిపిస్తోంది. విక్రయదారుడు దాని ధరలను రూ.500, రూ.550గా పేర్కొన్నాడు. అప్పుడు ఓ ప్రయాణికుడు పవర్ బ్యాంక్ నకిలీదిగా గుర్తించాడు.
READ MORE:NEET Paper Leak: నీట్ పేపర్ లీక్తో తేజస్వీ యాదవ్కు సంబంధం ఉంది..
Also Read
- Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
- IND Vs PAK: పాకిస్థాన్పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
రైలులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఒక్క నిమిషం వీడియో వేగంగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వినియోగదారులు దీనిని ‘స్కామ్ 2024’ అని పిలుస్తున్నారు. వీడియోలోని వివరాల ప్రకారం.. సేల్స్మ్యాన్ రైలులో వచ్చి పవర్ బ్యాంక్ కావాలా వద్దా అని ఒక ప్రయాణికుడిని అడుగుతాడు. ఇది కంపెనీకి చెందిన పవర్ బ్యాంకేనా అని ప్రయాణికుడు అడుగుతాడు. విక్రయదారుడు అవునని సమాధానమిస్తాడు. ఏడాది గ్యారెంటీ ఉందని చెప్పాడు. రూ.500 నుంచి రూ.550 రేంజ్ లో తన వద్ద చాలా పవర్ బ్యాంక్స్ ఉన్నాయని చెప్పాడు. కొన్ని కంపెనీ పేర్లతో ఉన్న నకిలీ పవర్ బ్యాంకులను ప్రయాణికుడికి చూసిప్తాడు. ప్యాసింజర్ బేరం ఆడటంతో పవర్ బ్యాంక్ని రూ.300కి ఇచ్చేందుకు అంగీకరిస్తాడు విక్రయదారుడు. దీని తర్వాత ప్రయాణీకుడు పవర్ బ్యాంక్ వెనక భాగం నుంచి తెరిచి చూస్తాడు.
READ MORE: Darshan Wife: ఆ వార్తలు ప్రసారం చేయొద్దు.. కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న దర్శన్ భార్య!
అది పూర్తిగా మట్టితో నిండి ఉంటుంది. ప్రయాణికుడు ఇలా చేస్తాడని దాన్ని అమ్మే వ్యక్తి అనుకోలేదు. దాన్ని ప్రయాణికుడి నుంచి లాక్కునేందుకు ప్రయత్నించాడు. పోస్ట్కి సంబంధించిన క్యాప్షన్లో ‘పవర్ బ్యాంక్లో మట్టి కనిపించింది. జాగ్రత్త.’ ఓ వినియోగదారు ద్వారా పోస్ట్ను సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ “ఎక్స్”లో భాగస్వామ్యం చేసారు. దీనికి ఇప్పటి వరకు 3.29 లక్షల వ్యూస్ వచ్చాయి. కాగా 3.3 వేల మంది లైక్ చేశారు. సోషల్ మీడియా వినియోగదారులు కూడా పోస్ట్పై కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
पावर बैंक में निकली मिट्टी, सावधान रहें सतर्क रहें 🥺 pic.twitter.com/PiOsJkizCZ
— Sankott (@Iamsankot) June 18, 2024
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!