Darshan Wife: ఆ వార్తలు ప్రసారం చేయొద్దు.. కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న దర్శన్ భార్య!
- రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ అరెస్ట్
- అన్నపూనేశ్వరి నగర్ పోలీసు కస్టడీలో దర్శన్
- నిరాధారమైన వార్తలను ప్రసారం చేయడంపై నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి ఇంజెక్షన్ ఆర్డర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Darshans Wife Vijayalakshmi Gets Injunction Order Against to Telecast False News: చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడ, వినయ్, నాగరాజ్ సహా 17 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్లో వారందరినీ విచారిస్తున్నారు. కాగా, రేణుకా స్వామి కేసుపై నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి మొదటి సారిగా స్పందనను తెలియజేశారు. ముందుగా రేణుకా స్వామి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన కుటుంబానికి ఆయన మృతిని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను అని విజయలక్ష్మి దర్శన్ తెలిపారు. దీంతో పాటు విజయలక్ష్మి దర్శన్ పై కోర్టు నుంచి నిషేధాజ్ఞలు తీసుకొచ్చారు.
Film Chamber: చంద్రబాబు, పవన్ ల అపాయింట్మెంట్ కోరిన ఫిలిం ఛాంబర్
Also Read
ఈ కేసుకు సంబంధించి కట్టుకథలు ప్రచురించడంపై ఇంజెక్షన్ ఆర్డర్ కాపీని షేర్ చేసిన విజయలక్ష్మి దర్శన్, “గత కొన్ని రోజులుగా, దర్శన్, నేను, మా అబ్బాయి, దర్శన్ బందువులు, స్నేహితులు వర్ణించలేని బాధను అనుభవించాము. గౌరవనీయ న్యాయస్థానం ఆదేశాల మేరకు మీడియా, సోషల్ నెట్వర్క్లలో ఇకపై ఎలాంటి అబద్ధాలు, అనధికార సమాచారం ప్రచురించరాదని ఆమె అన్నారు. అమ్మ చాముండేశ్వరి(మైసూరు చాముండి అమ్మవారు)పై, మన న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది.. సత్యమేవ జయతే అని విజయలక్ష్మి అన్నారు. ఇక, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ భార్య విజయలక్ష్మిని బుధవారం (జూన్ 19) విచారించారు. హత్యాకాండకు జరిగిన తర్వాత దర్శన్ తన భార్య విజయలక్ష్మిని కలిశాడు.
అన్నపూర్ణేశ్వరి నగర్లోని పోలీసు స్టేషన్లో విజయలక్ష్మి దర్శన్ ను కలిసేందుకు అనుమతించారు. అనంతరం విచారణ నిమిత్తం విజయలక్ష్మిని గంటల తరబడి విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. అంతకుముందు దర్శన్ తరపు న్యాయవాది అనిల్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. అన్ని మీడియాల్లోనూ దర్శన్ పవిత్ర గౌడను దర్శన్ భార్యగా చూపిస్తున్నారని.. దీంతో విజయలక్ష్మి దర్శన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని.. దర్శన్ కు విజయలక్ష్మి ఒక్కరే భార్య ఆమె తప్ప ఎవరూ లేరని అన్నారు. ఇక దర్శన్, పవిత్ర గౌడ సహా 17 మంది నిందితుల పోలీసు కస్టడీ గురువారం (జూన్ 20)తో ముగియనుంది. నిందితులను ట్రయల్ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!