Darshan Wife: ఆ వార్తలు ప్రసారం చేయొద్దు.. కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న దర్శన్ భార్య!
- రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ అరెస్ట్
- అన్నపూనేశ్వరి నగర్ పోలీసు కస్టడీలో దర్శన్
- నిరాధారమైన వార్తలను ప్రసారం చేయడంపై నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి ఇంజెక్షన్ ఆర్డర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Darshans Wife Vijayalakshmi Gets Injunction Order Against to Telecast False News: చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడ, వినయ్, నాగరాజ్ సహా 17 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్లో వారందరినీ విచారిస్తున్నారు. కాగా, రేణుకా స్వామి కేసుపై నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి మొదటి సారిగా స్పందనను తెలియజేశారు. ముందుగా రేణుకా స్వామి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన కుటుంబానికి ఆయన మృతిని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను అని విజయలక్ష్మి దర్శన్ తెలిపారు. దీంతో పాటు విజయలక్ష్మి దర్శన్ పై కోర్టు నుంచి నిషేధాజ్ఞలు తీసుకొచ్చారు.
Film Chamber: చంద్రబాబు, పవన్ ల అపాయింట్మెంట్ కోరిన ఫిలిం ఛాంబర్
Also Read
- Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
- Pradeep Ranganathan: ఆ డైరెక్టర్'తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
- Rao Bahadur: "మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!" రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
- Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
ఈ కేసుకు సంబంధించి కట్టుకథలు ప్రచురించడంపై ఇంజెక్షన్ ఆర్డర్ కాపీని షేర్ చేసిన విజయలక్ష్మి దర్శన్, “గత కొన్ని రోజులుగా, దర్శన్, నేను, మా అబ్బాయి, దర్శన్ బందువులు, స్నేహితులు వర్ణించలేని బాధను అనుభవించాము. గౌరవనీయ న్యాయస్థానం ఆదేశాల మేరకు మీడియా, సోషల్ నెట్వర్క్లలో ఇకపై ఎలాంటి అబద్ధాలు, అనధికార సమాచారం ప్రచురించరాదని ఆమె అన్నారు. అమ్మ చాముండేశ్వరి(మైసూరు చాముండి అమ్మవారు)పై, మన న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది.. సత్యమేవ జయతే అని విజయలక్ష్మి అన్నారు. ఇక, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ భార్య విజయలక్ష్మిని బుధవారం (జూన్ 19) విచారించారు. హత్యాకాండకు జరిగిన తర్వాత దర్శన్ తన భార్య విజయలక్ష్మిని కలిశాడు.
అన్నపూర్ణేశ్వరి నగర్లోని పోలీసు స్టేషన్లో విజయలక్ష్మి దర్శన్ ను కలిసేందుకు అనుమతించారు. అనంతరం విచారణ నిమిత్తం విజయలక్ష్మిని గంటల తరబడి విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. అంతకుముందు దర్శన్ తరపు న్యాయవాది అనిల్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. అన్ని మీడియాల్లోనూ దర్శన్ పవిత్ర గౌడను దర్శన్ భార్యగా చూపిస్తున్నారని.. దీంతో విజయలక్ష్మి దర్శన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని.. దర్శన్ కు విజయలక్ష్మి ఒక్కరే భార్య ఆమె తప్ప ఎవరూ లేరని అన్నారు. ఇక దర్శన్, పవిత్ర గౌడ సహా 17 మంది నిందితుల పోలీసు కస్టడీ గురువారం (జూన్ 20)తో ముగియనుంది. నిందితులను ట్రయల్ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!