Cough : దగ్గు తగ్గడం లేదా.. అదిరిపోయే వంటింటి చిట్కాలు ఇవిగో..!
దగ్గు, జలుబు లేకుండా ఉంటే మనం చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు ఫీలవుతాం. అదే గొంతులో తేడాగా ఉన్నా… ముక్కులో గడబిడ ఉన్నా… క్రమంగా మనం నీరసించిపోతాం. ముఖ్యంగా చలికాలంలో దగ్గు, జలుబు మనల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అయితే.. ఎడతెరిపి లేకుండా వచ్చే దగ్గు మనిషిని కుంగదీస్తుంది. ఒక వేళ మీకు దగ్గు ఎక్కువగా వస్తున్నా, ఛాతి వద్ద మంట లేదా భారంగా అనిపిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలి. అయితే.. ఈ వంటింటి చిట్కాలతో కూడా దగ్గు, జలుబులకు చెక్ పెట్టవచ్చు.
వాము: పొడి దగ్గు పగటి కంటే రాత్రి సమయంలో ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. నిద్రపట్టకుండా ఉక్కిరిబిక్కిరి చేసుకుంది నిద్రించే దానికి ముందు చిటికెడు వామును నలిపి, దవడ ని పెట్టుకొని చప్పరించాలి. ఇలా చేయడం వల్ల దగ్గు అదుపులోకి వస్తుంది.
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
తులసి : జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం పూట తులసి ఆకులను నమలాలి, వీలైతే నీళ్ళలో వేసి మరిగించి కషాయంగా తీసుకోవచ్చు. తులసి కషాయం కఫాన్ని నివారించి ఉపశమనం కలిగిస్తుంది.
దాల్చిన చెక్క : ఇందులో వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్లను ఎదుర్కొనే గుణాలు ఆధికం. జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. దాల్చిన చెక్క పొడిలో తేనె కలిపి చప్పరించాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
అల్లం : దీంట్లో యాంట వైరల్, ఫంగల్ గుణాలు అధికం. దగ్గు, గొంతునొప్పి వంటి వాటిని అదుపు చేస్తుంది. అల్లం సన్నగా తరిగి నమలడం, లేదంటే అల్లం టీ తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.
తేనె : వంటింటి ఔషధాలలో తేనె ఒకటి. అల్లం, లేదంటే నిమ్మరసంలో తేనె కలిపి తీసుకోవాలి. అతిగా కాకుండా పరిమితంగా తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. తేనే, నిమ్మరసం రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
మిరియాలు : చిటికెడు, మిరియాల పొడికి చెంచా తేనె చేర్చి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దగ్గు తీవ్రత తగ్గుముఖం పడుతుంది. ఇలా ఉదయం పూట మాత్రమే తీసుకుంటే రోజంతా దాని ప్రభావం ఉంటుంది.
పసుపు : యాంటీ సెప్టిక్ గుణాలున్న పసుపు పలు వ్యాధుల్ని నయం చేస్తుంది. జలుబు, దగ్గు విపరీతంగా బాధ ఇస్తున్నప్పుడు గ్లాస్ గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు వేసుకొని తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!