IKEA Fined: 20 రూపాయల కోసం కక్కుర్తి పడితే.. రూ.3వేలు ఫైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IKEA Fined: ప్రస్తుతం ఎక్కడ చూసినా షాపింగ్మాల్స్, సూపర్ మార్కెట్లు దర్శనమిస్తున్నాయి. సూపర్మార్కెట్లలో షాపింగ్ చేసిన వారికి ఆ మాల్ వారే క్యారీ బ్యాగ్లు ఇస్తారు. దానికి కూడా మనం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని మాల్స్లో క్యారీబ్యాగ్లకు వాటి లోగోలు ఉంటాయి. లోగోలు ఉన్న క్యారీ బ్యాగ్లకు మనం డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే, బెంగుళూరులోని ఐకియా మాల్లోని క్యారీబ్యాగ్లకు లోగోలు ఉన్నాయి. అయినా సరే, వినియోదారుల నుంచి ఆ మాల్ సిబ్బంది డబ్బులు వసూలు చేశారు. ఈ విషయంపై ఓ మహిళ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించింది. దీంతో ఆ మాల్పై 20 రూపాయల క్యారీ బ్యాగ్ కోసం రూ.3వేల జరిమానాను విధించింది వినియోగదారుల కోర్టు.
Also Read: Kurnool Crime: పెళ్లి పీఠలెక్కిన ఇన్స్టాగ్రామ్ ప్రేమ.. భార్యే భర్తను చంపిందంటున్న బంధువులు
Also Read
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
బెంగుళూరుకు చెందిన సంగీత బోహ్ర అనే మహిళ అక్టోబర్ 6న ఐకియా మాల్లో షాపింగ్ చేసింది. ఆ షాపింగ్లో సంగీత 2 వేల 428 రూపాయల విలువైన వస్తువులను కొనుగోలు చేశారు. అయితే, ఈ మాల్లో షాపింగ్ చేసేవారు ఇంటినుంచి బ్యాగ్లను తెచ్చుకోకూడదు. అందుకోసం ఆమెకు ఓ క్యారీ బ్యాగ్ అవసరమైంది. అయితే అక్కడ వున్న సిబ్బందిని సంగీత క్యారీ బ్యాగ్ను అడిగారు. అయితే ఐకియా లోగో ఉన్న క్యారీ బ్యాగ్ను ఇచ్చి ఆమె నుంచి అక్కడి సిబ్బంది 20 రూపాయలను వసూలు చేశారు. కంపెనీ లోగో వున్న బ్యాగ్లకు కూడా డబ్బులు ఎలా వసూలు చేస్తారంటూ సిబ్బందిపై వాదనకు దిగారు సంగీత. అయినా అక్కడి యాజమాన్యం ఏమాత్రం దాని గురించి పట్టించుకోలేదు. దాంతో ఆ మహిళ స్టారో లోగో ఉన్న బ్యాగ్కు 20 రూపాయలు ఎలా వసూలు చేస్తారంటూ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించింది. ఆ బ్యాగ్కు ఛార్జీ వసూలు చేసినందుకు పరిహారంగా మూడువేల రూపాయలు చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించింది ఆ మహిళ.20 రూపాయల కవర్కు వడ్డీతో కలిపి నష్టపరిహారంగా వెయ్యిరూపాయలు, న్యాయపరమైన ఖర్చులకు రెండువేల రూపాయలు చెల్లించాలంటూ వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టు ఐకియా మాల్కు జరిమానా విధించింది. ఇచ్చిన తీర్పు ప్రకారం జరిమానా విధించిన 30 రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!