NIA Searches: దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 17 చోట్ల ఎన్ఐఏ సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA Searches: బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి లష్కరే తోయిబా తీవ్రవాదులు పరారీ కేసులో దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 17 చోట్ల ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. ఢిల్లీ, ముంబయి, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో పాటు మరో రెండు రాష్ట్రాల్లోని 17 చోట్ల ఎన్ఐఏ బృందాలు సోదాలు చేస్తున్నాయి. 2013లో బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి తీవ్రవాదులు పరారయ్యారు. ఈ కేసులో గతేడాది అనుమానితుల ఇండ్లల్లో సోదాలు చేయగా.. భారీగా ఆయుధాలను గుర్తించారు NIA అధికారులు. 2024 జనవరిలో ఛార్జిషీటు దాఖలు చేసింది ఎన్ఐఏ.
2023, జులైలో లష్కరే తోయిబా తీవ్రవాది నజీర్ భావజాలానికి ఆకర్షితులై పనిచేస్తున్న ఐదుగురిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 7 పిస్తోళ్లు, 4 హ్యాండ్ గ్రానేడ్లు, 45 లైవ్ రౌండ్లు, 4 వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బెంగళూరు పోలీసులు.. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించారు. ఈ కేసు దార్యప్తులో భాగంగా..2024, జనవరిలో ఛార్జిషీటు దాఖలు చేసిన NIA అధికారులు… నిందితులకు పలు కేసుల్లో తీవ్రవాద సంస్థలతో ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. ఈ ఏడాది జనవరి 12వ తేదీన బెంగళూరు లష్కరే తోయిబా (ఎల్ఈటీ) జైలులో జీవిత ఖైదీలు, ఇద్దరు పరారీలో ఉన్నవారితో సహా ఎనిమిది మందిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చార్జిషీట్ దాఖలు చేసింది.
Also Read
Read Also: PM Modi: పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ రెండోసారి బాధ్యతలు.. ప్రధాని మోడీ శుభాకాంక్షలు
చార్జిషీట్లో చేర్చబడిన నిందితుల్లో కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన నజీర్ కూడా ఉన్నారు, అతను 2013 నుండి బెంగళూరు సెంట్రల్ జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. జునైద్ అహ్మద్ అలియాస్ జేడీ, సల్మాన్ ఖాన్ విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.మరికొందరిని సయ్యద్ సుహైల్ ఖాన్ అలియాస్ సుహైల్, మహ్మద్ ఉమర్ అలియాస్ ఒమర్, జాహిద్ తబ్రేజ్ అలియాస్ జాహిద్, సయ్యద్ ముదస్సిర్ పాషా, మహ్మద్ ఫైసల్ రబ్బానీ అలియాస్ సాదత్లుగా గుర్తించారు. మొత్తం ఎనిమిది మంది నిందితులపై భారతీయ శిక్షాస్మృతి, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, పేలుడు పదార్థాల చట్టం, ఆయుధాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగపత్రం నమోదు చేశారు.
తాజావార్తలు
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
-
Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!