Ranji Trophy 2026: తొలి రంజీ ట్రోఫీ ఫైనల్ అంచున జమ్మూ కాశ్మీర్.. బెంగాల్ నడ్డి విరిచిన జమ్మూ బౌలర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranji Trophy 2026: రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో జమ్మూ కాశ్మీర్ జట్టు చరిత్రాత్మక విజయానికి చేరువైంది. కల్యాణి వేదికగా జరుగుతున్న రెండో సెమీఫైనల్లో బెంగాల్ క్రికెట్ టీంపై జమ్మూ కాశ్మీర్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ పై పూర్తి ఆధిపత్యం సాధించారు. 126 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జమ్మూ కాశ్మీర్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో 2 వికెట్లకు 43 పరుగులు చేసింది. ఇక విజయానికి వారికి కేవలం 83 పరుగులు మాత్రమే అవసరం.
IND vs NED: భారత్ దూకుడుకు నెదర్లాండ్ నిలుస్తుందా? భారత్ నుండి ఆ కీలక ప్లేయర్ అవుట్!
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
ఇక ఈ మ్యాచ్ లో మొదట ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన బెంగాల్ జట్టు 328 పరుగులు చేసింది. ఇందులో సుదీప్ కుమార్ ఘరామి 146 పరుగులతో అద్భుత శతకం సాధించగా.. అతనికి తోడుగా అభిమన్యు ఈశ్వరన్ 49 పరుగులు చేశాడు. ఇక జమ్మూ కాశ్మీర్ బౌలర్ అక్విబ్ నబీ ఐదు వికెట్లు తీసి బెంగాల్ను కట్టడి చేశాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన జమ్మూ కాశ్మీర్ తొలి ఇన్నింగ్స్లో 302 పరుగులు చేసింది. ఇందులో అబ్దుల్ సమద్ 82 పరుగులతో జట్టుకు మంచి స్కోరు అందించాడు. ఈ ఇన్నింగ్స్లో భారత పేసర్ మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి 8 వికెట్లు తీసి మ్యాచ్ను మలుపుతిప్పాడు.
BBL Match in India: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్లో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్?
ఇక రెండో ఇన్నింగ్స్ లో 26 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ జట్టు పూర్తిగా కుప్పకూలింది. జమ్మూ కాశ్మీర్ బౌలర్ల దాడికి 25.1 ఓవర్లలో కేవలం 99 పరుగులకు ఆలౌట్ అయింది. జమ్మూ కాశ్మీర్ బౌలర్లు అక్విబ్ నబీ, సునీల్ కుమార్ చెరో నాలుగు వికెట్లు తీసి బెంగాల్ బ్యాటింగ్ను దెబ్బతీశారు. దీంతో జమ్మూ కాశ్మీర్కు 126 పరుగుల సులభ లక్ష్యం లభించింది. లక్ష్య ఛేదనలో జమ్మూ కాశ్మీర్ జట్టు జాగ్రత్తగా ఆడుతోంది. శుభమ్ పుండిర్ 23 పరుగులతో, వంశాజ్ శర్మ 9 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. లక్ష్యాన్ని చేరుకుంటే జమ్మూ కాశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్కు చేరే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..